Russian history గురించి నాకు తెలిసింది చెప్పాలనుకున్నప్పుడు Communism
గురించి నా జీవితంలో నేను ఏర్పరుచుకున్న అవగాహన కొంత చెప్పాలనిపించింది. Russian
history గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. 1983-1989 లో నేను చదివిన శ్రీశ్రీ, 1987 లో చదివిన dialectical
materialism మీద పుస్తకం, 1988 లో చదివిన
కార్ల్ మార్క్స్ వ్రాసిన capital తెలుగు అనువాదంలో కొంత భాగం, 1989 లో newspapers లో వచ్చిన perestroika మీద కొంత details, 1990 వరకు నేను చదివిన social
books లోని history ఇంతే నా knowhow. నాకు history మీద తిరిగి interest కలిగేలా ప్రపంచ చరిత్ర చెప్పిన నా స్నేహితుడు రామకృష్ణ కి సదా ఋణపడి
ఉంటాను. చరిత్ర అందరూ చెప్తారు. దాన్ని కొంతమందే అర్ధం అయ్యేలా మనసుకు హత్తుకునేలా
చెప్పగలరు. ఆ కొద్దిమందిలో నా స్నేహితుడు రామకృష్ణ మాస్టర్ ఒకడు అని సగర్వంగా
చెప్పగలను. నేను 7th
std లోనే దక్షిణ భారత్ హిందీ ప్రచార్ సభ పరీక్షలు వ్రాయటం
మొదలెట్టాను. నేను 9th std కి వచ్చేసరికి ఈ హిందీ
ప్రచార్ సభ పరీక్షల్లో “రాష్ట్ర” level
లోనో, “విశారద” level లోనో ఉండేవాడిని. హిందీ తో పాటు అందులో తెలుగు పరీక్షలు
కూడా ఉండేవి. తెలుగు text book లో కవిత్వం ఉండేది. కుందుర్తి
ఆంజనేయులు వ్రాసిన “నగరంలో వాన”, తిలక్ “అమృతం కురిసిన
రాత్రి” , శ్రీశ్రీ వ్రాసిన “జగన్నాధ రధచక్రాలు” పద్యాలు
ఉండేవి. అందులో శ్రీశ్రీ వ్రాసిన జగన్నాధ రధచక్రాలు నాకు బాగా నచ్చింది. చదవడానికి
ఒక rhythm ఉండేది. నేను ఆ పద్యం బట్టి పట్టేశాను. 9th
std లో మాకు R.S.ప్రసాదరావుగారు సోషల్ టీచర్.
ఆయన నేను communist ని అంటుండేవాడు. వెంపటాపు సత్యం
చచ్చిపోయినప్పుడు మా class లో బుర్ర పట్టుకుని కూర్చున్నాడు.
ఆయన నాకు శ్రీశ్రీ పద్యం వచ్చు అంటే, class లో లేచి నిలబడి చెప్పమన్నారు. నేను జగన్నాధ రధచక్రాలు చెప్పిన తరువాత
నన్ను చాలా మెచ్చుకున్నాడు. ఆయన ప్రభావం నామీద చాలా ఉండేది. ఆ తరువాత Intermediate
కి వచ్చిన తరువాత ఏ కవిత్వం లేకుండా గడిచిపోయింది. మళ్ళీ ఆకలి
రాజ్యం cinema చూసే దాకా నాకు శ్రీశ్రీ గురించి మళ్ళీ flash
అవ్వలేదు. రాంబాబు కలిసిన తరువాత మేమిద్దరం కలిసి కొన్న మొదటి
పుస్తకం శ్రీశ్రీ మహాప్రస్థానం. ఆ తరువాత శ్రీశ్రీ, నగ్నముని, చెరబండరాజు లాటి కవులు వ్రాసిన విరసం ప్రచురణలు దాదాపు అన్నీ చదివాను.
నేను శ్రీశ్రీ ప్రభావంలో ఉండేటప్పుడు communism అంటే ఒక
స్వర్గాన్ని తయారుచేసే tool అనుకునే వాడిని. శ్రీశ్రీ ఏకంగా
“గర్జించు రష్యా గాండ్రించు రష్యా “, “లెనిన్ ధమని, లెనిన్
ద్యుమణి “, అని వ్రాస్తే నేను ఎప్పటికైనా ప్రపంచమంతా communism
వచ్చేస్తుంది అనే నమ్మకంలో ఉండేవాడిని. కాళీపట్నం రామారావు గారు
వ్రాసిన communist tint లో realistic base ఉన్న “యజ్ఞ్యమ్” & “కుట్ర” కథలు బాగా నచ్చాయి. 1988
లో Andhra university లో ఏదో radicals meeting అంటే ఈ పుస్తకాల ప్రభావం లోనే వెళ్ళాను. వాళ్ళు mess లో chicken పెట్టలేదు-warden పని
పట్టాలి, ఇంకెవడో తప్పు మాట్లాడాడు - వాడిని తన్నాలి ఇలాటి discussions
చేస్తుంటే విసుగెత్తి వచ్చేశాను. నా engineering friends కూడా నేను ఈ communism topics పెట్టి కుమ్ముతుంటే
వాళ్ళు కూడా భయపడి నా దగ్గిరకి వచ్చేవారు కారు. భారత దేశం లో ఈ communist
principles follow అయినవాళ్ళు naxalites అన్నప్పుడు, నాకు naxals మీద కూడా ఒక గౌరవం ఒక soft
corner ఉండేది వాళ్ళతో ఏ రకమైన link లేకపోయినా. Communism గురించి ఆంధ్ర
లో చేసే పోరాటాలలో communists తమ ఆస్థులు కూడా ధారపోసి ఒక
ఉద్యమానికి ఊపిరి పోస్తున్నారంటే గౌరవం కలిగేది. మధ్యలో వాళ్ళకి ఉన్నది అంతా
ఉమ్మడి సోత్తే - భార్యలతో సైతంగా అన్నప్పుడు గాభరా అనిపించింది. Perestroika
తరువాత, Russia ముక్కలైపోయినప్పుడు
ఇదేమిటి ఇలా జరిగింది ఇలా జరగకూడదే అనుకున్నాను. అప్పుడు newspapers లో వచ్చినవి చదివి అసలు చరిత్రలో నిజం అంటూ ఏమైనా ఉందా? ఈ communism ఎంతవరకు ఆచరణయోగ్యం అనే సందేహం
కలిగింది. తరువాత నేను ఉద్యోగంలో పడ్డ తరువాత తదనంతరం పెళ్ళైన తరువాత అసలు communism
అన్నది నా memory లోంచి పూర్తిగా
తుడిచిపెట్టుకు పోయింది.
Saturday, June 9, 2012
Friday, June 8, 2012
ఆలోచనల స్రవంతి - 33
Inflation is general rise
in the level of prices and services over a period of time. అసలు Inflation కి వేరు వేరు కాలాలలో వేరు వేరు definitions ఉండి, ఇప్పుడు ఈ ముందు చెప్పిన definition “పరిమిత కాలంలో నిత్యావసర సరుకుల, వినిమయ వస్తువుల, సేవల లేదా స్థిరాస్తుల ధరల తాలూకు పెరుగుదల” ని inflation అంటున్నారు. దీన్ని control చెయ్యడంలో economy
తాలూకు ఆరోగ్య పరిస్థితి బయట పడుతుంది. ఇది ఎంత తక్కువలో స్థిరంగా
ఉంటే అంత మంచిది. దీన్ని అదుపులో ఉంచగలిగితే రూపాయి విలువ పెరుగుతుంది. నాకు
తెలిసినవేంటంటే
1.
దిగుమతి తగ్గించి ఎగుమతి పెంచాలి – ముఖ్యంగా దిగుమతి
చేసుకునేది oil products కాబట్టి అవి తగ్గించాలంటే alternate energy
sources మీద దృష్టి పెట్టాలి –ఉదాహరణకి solar energy, wind energy ని use చేసుకోవచ్చు.
దీనికి technology improvement & implementation అవసరం. ఇది ఇప్పట్లో జరిగేలా కనపడటం లేదు ఎందుకంటే alternate use చెయ్యడం మొదలెడితే ఎంతో మంది vested interests దెబ్బతింటాయి.
వాళ్ళు పడనివ్వరు.
2.
మనవాళ్లు మన దగ్గిర ఉన్న dollar reserve అమ్మేసి
తాత్కాలికంగా రూపాయి విలువ పెంచొచ్చు. కానీ తరువాత imports కి
కట్టడానికి foreign exchange reserve తగ్గిపోతే కష్టం. So
అదీ immediate గా జరగదు.
3.
ఏవైతే company లు dollar accounts maintain చేస్తున్నాయో అవి ఆ dollars ని rupees లోకి convert చేసి మన market లోకి
pump చెయ్యాలి. వాళ్ళు చెయ్యరు.
4.
Government కానీ company లు కానీ రూపాయి విలువ తగ్గినప్పుడు తీసుకున్న అప్పులు తీర్చకూడదు.
పెరిగినప్పుడు తక్కువ రూపాయిలతో ఎక్కువ అప్పు తీర్చొచ్చు. అప్పిచ్చిన వాడు
ఊరుకుంటాడా ఊరుకోడు.
5.
మన company లకి విదేశాల్లో అప్పులు చెయ్యడానికి rules
లో వెసులుబాటు కల్పించాలి. అప్పుడు వాళ్ళు ముందు అప్పు తీసుకుని
రూపాయి బలపడ్డప్పుడు అప్పు తీరిస్తే సారి. మరి రూపాయి విలువ తరువాత ఇంకా పడిపోతే ఆ
company పరిస్థితి? అది company
తాలూకు policy మీద ఆధారపడి ఉంటుంది. ఎంత వరకు
జరుగుతుందో తెలియదు.
6.
Government విదేశీ పెట్టుబడిదారులని
ఆకర్షించి ఎక్కువ పెట్టుబడులు పెట్టించాలి. అప్పుడు కొంత ఆగుతుంది కానీ control
ఇంకోడి చేతుల్లోకి వెళ్లిపోతుంది. Already వెళ్లిపోయింది, ఇంకా మిగిలింది ఏమైనా ఉంటే అది కూడా పోతుంది.
7.
మనవాళ్లు agriculture production పెంచి నిత్యవసర
సరుకుల ధరలు తగ్గించి, తద్వారా ప్రజలకి ఒక awareness తెచ్చి, ఇంకా మన మేధావులు వలస పోకుండా ఆపి, కొత్తగా వస్తున్న technology ప్రజల శ్రేయస్సుకి
ఉపయోగించి విదేశాలు కూడా మన technology మీద ఆధారపడేలా చేసి
మన సరుకుల నాణ్యత పెంచి etc.,
అంటే ఎవడూ రూపాయి పడిపోవడాన్ని ప్రస్తుత పరిస్థితులలో
రక్షించలేడు.
కానీ మనం రక్షించొచ్చు. గాంధీ గారి style. విదేశీ కంపెనీలు తయారుచేసిన సరుకులు వాడకూడదు. ఇది కొంత వరకు రూపాయి
పడిపోకుండా కాపాడుతుంది. చెయ్యొచ్చు. ఈ సలహా face book, twitter account ఉన్న ప్రతి
భారతీయుడికి తెలుసు. “If you love India please share” అని
ఎవడో అంటాడు, తెగ share చేసుకుంటారు.
ఎవడూ follow అవ్వడు. అసలు ఏంటి మన national
psychology అని ఎవడికైనా doubt వస్తుంది. ఈ history
duping గురించి నాకు తెలిసిన మరో రెండు మూడు సంగతులు చెప్పుకుని
అప్పుడు psychology మీద పడదాం.
నా inference ఏంటంటే ఏ దేశమైన ఒక limit తరువాత saturate
అయిపోతుంది. పెరుగుతున్న జనాభా కి తగ్గట్టుగా వనరుల ఉత్పత్తి
పెంచుకుంటూ పోతే, కరువు ఉండదు. జనాభా అదుపులో ఉంటే పరవాలేదు.
కానీ మన ఉత్పత్తి కంటే వాడకం ఎక్కువ అయితే అప్పుడు కష్టం. ఎప్పుడైతే మన దగ్గిర
సరుకులు అయిపోతాయో అప్పుడు పక్కవాడివి కూడా మనం తినడం మొదలెట్టాలి. Ecological
balance ఎలా maintain అవుతుందో అదే principle
economic balance కి కూడా. ఇది అమెరికా,UK,
ఆస్ట్రేలియా, జర్మని వంటి ఆగ్ర రాజ్యాలు ఎప్పుడో
గుర్తించాయి. అందుకే వారి దేశం కొంత సౌకర్యంగా ఉండడానికి మిగతా దేశాల economy
ని చప్పరించుకుని తినేస్తాయి. అన్ని రకాల bullying
techniques ఉపయోగించి USA తన ఆధిక్యం ఈ రోజు
నిలబెట్టుకుంటున్నది. మన మీద వాళ్ళ పరిస్థితి మెరుగే కానీ వాళ్ళ దగ్గిరా పూర్తి solution
లేదు. Canada వెళ్ళిన నా friend చెప్పాడు. Medical facilities USA కంటే Canada
లో బాగుంటాయి, insurance లేకపోతే USA లో ఏదైనా treatment ఖర్చులు తట్టుకోలేము అని. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి వేరే దేశాలలో వాళ్ళు
జరిపే మారణకాండలు ప్రపంచమంతా తెలుసు. కానీ అందరికీ ఒక భయం. ఒక stand తీసుకోడానికి భయం. నిజం నిర్భయంగా చెప్పడానికి భయం. మన దేశం వాళ్ళు ఏమి
తక్కువ కాదు. ఈ USA example తో మనవాళ్లు శ్రీలంకలో
ప్రదర్శనకి దిగితే వాళ్ళు తరిమి కొట్టేరు, LTTE ని. మరి దీని అర్ధం ఏంటి అంతే “చీమా కుడుతుంది, పామూ
కుడుతుంది. చీమ కుడితే మనం చీమను చంపుతాము. అదే పాము కుడితే మనము చస్తాము”. ఇది
ప్రపంచం. Survival of the fittest అంతే. మరి ఇందులో duping
ఎంటయ్యా అంటే చెప్పేది ఏంటంటే, media లో ప్రచారం జరిగేది ఒకటి. అసలు ఆంతర్యం ఇంకోటి.
Russia perestroika
తరువాత ముక్కలు ముక్కలు అయిపోయింది. ఇది కొంత వాళ్ళ స్వయంకృతం, communism లో ఉన్న loopholes, మిగిలింది వాటిని exploit చేసే sam పెద్దన్న ఆశీర్వాదమేనని నా నమ్మకం. Russian history గురించి
next post లో.
సశేషం
Wednesday, June 6, 2012
ఆలోచనల స్రవంతి -32
Globalization తరువాత
ప్రతీ దేశం తమ ఉనికిని కాపాడుకోవడానికి imports & exports మీదే ఆధారపడుతుంది. అవి రెండు balanced గా
ఉన్నంత కాలం ఏ ఇబ్బంది లేదు. ఎప్పుడైతే imports exports కంటే పెరిగిపోతాయో ఆ దేశం
తాలూకు మారకం విలువ పడిపోతుంది. అంటే మనము అవతలవాడికి అమ్మే దాని కంటే కొనేవి
ఎక్కువ అయ్యాయి. ఆదాయం కంటే వ్యయం పెరిగితే అప్పుల పాలే.
ఇప్పుడే
కాదు భారత దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గిర నించి ఇదే పరిస్థితి. మనది Mixed economy. అంటే
కొన్ని పరిశ్రమలు government run చేస్తుంది, కొన్ని private parties run చేస్తాయి.
కారా మాస్టర్ కుట్ర లో చెప్పినట్టు మన దేశం భ్రష్టు
పట్టి పోవడానికి కారణం మన policies & decision making. Heavy industries అంటే భార పరిశ్రమలు అన్నీ government, Corporate Industries అంటే భారీ పరిశ్రమలు అన్నీ private. అంటే
ప్రజల సొమ్ముతో పెట్టిన పరిశ్రమలు అన్నీ private పరిశ్రమలుకి ముడి సరుకులు
అందించే పరిస్థితే గానీ మన దగ్గిర ఉన్న low technology తో తయారైన heavy industrial goods కి globalగా demand లేదు. తయారుచేసినవి బయట
అమ్ముకోలేక, అమ్ముకోవడానికి
మన దేశంలో ఉండే పెట్టుబడిదారులు ఎవరూ ముందుకి రాకపోతే వాళ్ళకి concessions ఇచ్చి, అప్పులు
ఇచ్చి వాళ్ళని కోటీశ్వరులు చెయ్యడం తప్పితే ప్రజలకి ఒరిగిందేమీ లేదు. Liberalization పేరుతో Capitalist agenda ని
అద్భుతంగా అమలుపరచడం, దాన్ని ఏదో గొప్ప achievement అని
ప్రచారం చేసుకోవడం తప్ప నిజంగా ప్రయత్నిస్తే రూపాయి విలువ పడిపోకుండా ఆపొచ్చు
అన్నది మన నాయకులకి తట్టదు, అనిపించదు. ఎందుకంటే వాళ్ళ agenda యే వేరు. ఇప్పటికీ మనం technology వేరే దేశాలపై ఆధారపదడమే కానీ indigenous technology కి
సంబంధించి ఏమీ positive steps తీసుకున్న
దాఖలాలు కనపడవు. అప్పుడప్పుడు పృథ్వీ, అగ్ని అనడమే అంతే. మన దేశంలో
పుట్టి, మన
దేశంలో చదువుకుని, విదేశాలకి లాభం చేకూర్చడమే కానీ, మన దేశపు
మేధావులు మన దేశానికి చేస్తున్నదేమీ లేదు. కారణం ఏమిటంటే ఇక్కడ వాళ్ళ తెలివితేటలకి
గౌరవం లేదు. వసతులు లేవు. పైపెచ్చు ఇక్కడ ఏమైనా చేద్దామనుకున్నవాడికి unnecessary harassment. పరిపాలిస్తున్న
నాయకులకి ఏమి చేస్తే దేశానికి మంచి జరుగుతుందో తెలియదా – తెలుసు – కానీ
వాళ్ళ గొడవలు వాళ్ళకి ఉన్నాయి. దీనికి తోడు 90% మనకి బుర్రలు లేని నాయకులు. బుర్ర
ఉండి commitment ఉన్నవాడిని
రానివ్వరు. బుర్ర ఉన్నా అది వాడే అవసరం ఉండదు. ఇంకా ఏమైనా చేద్దామనుకున్న కొందరు
మనకెందుకులే అని ఈ international power play politics లో నలిగి ఊరుకోవడం. Balance ఏమైనా
మిగిలిపోతే అవి regional, communal
politics లో నలిగి
నాశనం. ఇంక మిగిలినవి మన private పెట్టుబడిదారులు మూసేశారు. అదీ
పరిస్థితి.
ఇప్పటికీ
భారతదేశం produce చేసే
సరుకులకి demand లేదు. మన crudeoil imports రోజురోజుకీ
పెరిగిపోతున్నాయి. ఈ crude oil reserves ని control చేస్తున్న USA తాలూకు dollar కి పరువు, బరువు.
అమెరికా ఇరాక్ లో చేసిన యుధ్ధం అంతా దీని గురించే. కారణం ఏదైనా చెప్పొచ్చు. నిజంగా
ఈ petrol, diesel లేకపోతే పని నడవదా? నడుస్తుంది
కానీ competition పెరిగిన
ప్రపంచంలో ఎవడి ఉనికి వాడు నిలబెట్టుకోవడానికి scooter, ఇంకా status కూడా add అయితే car తప్పవు.
ముందు వీటిని అమ్మితే వీటి ఇంధనం కోసం చచ్చినట్టు petrol, diesel కొనడమే. ఏ దేశమైతే resources control చేస్తుందో
దానిదే పైచెయ్యి. కొన్ని మనకి అవసరం లేకపోయిన బలవంతంగా మన జీవితాలలోకి
ప్రవేశపెట్టబడతాయి. ఉదాహరణకి toothpaste, brush లేకపోతే పళ్ళు తోముకోలేమా? నా చిన్నప్పుడు
మా తాతగారి ఊరిలో వేప పుల్లలు, లేదా ఉప్పు,కచ్చిక(కొబ్బరి డొక్కలు కాలిస్తే వచ్చేది) పెట్టి పళ్ళు
తోముకునే వారు. అప్పుడూ పళ్ళు శుభ్రం గానే ఉండేవి. ముందు status symbol గా అందరి
జీవితాలలోకి ప్రవేశించిన ఈ toothpaste ఇప్పుడు నిత్యావసరం లోకి మారింది.
ఇప్పుడు అది ఏ పల్లెటూరు అయిన brush, paste compulsory. ముందు అలవాటు చేసి, తరువాత ధర
పెంచడం, అవసరం లేని
వస్తువుని ప్రవేశపెట్టి అవసరంగా మార్చడం అదో marketing strategy. ఈ marketing గురించి
మాట్లాడుకుంటే అదో మహాసముద్రం. ఇప్పుడు industrialization దెబ్బకి చెట్లు కూడా లేవు వేప
పుల్లలు దొరకవు. రేపటి రోజున ఎవడో ఒకడు “nature in its
original form –herbal cure for teeth and gums – Neem stick” అని వేపపుల్లని toothpaste కంటే
ఎక్కువ rate కి
అమ్మేసినా ఆశ్చర్యపోవఖ్ఖరలేదు.
ఈ crude దెబ్బ
అక్కడితో ఆగదు. దీనివల్ల LPG ధర పెరుగుతుంది, రవాణా
ఖర్చులు పెరుగుతాయి, నిత్యావసర వస్తువుల ధర
పెరుగుతుంది, చివరిగా
మనం తినే తిండి ధర మనం భరించలేనంతగా పెరుగుతుంది. ఏదో విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో
చదువులు అంటే మానేయొచ్చు కానీ తిండి మానడం కుదరదు కదా. ఇంతకుముందు చరిత్రలో
ఇలాటివి జరగలేదా అని question రావోచ్చు. నూటికి నూరు శాతం
వచ్చి ఉంటాయి. కానీ చరిత్రలో అవి రాసుకోరు. ఒకవేళ రాసుకున్నా దాని గురించి
మాట్లాడుకోరు. ఉదాహరణకి మన విజయనగర సామ్రాజ్యంలో అంగట్లో రత్నాలు అమ్మేవారుట. Persia నించి వచ్చిన అబ్దుర్ రజాక్ చెప్పాడు కాబట్టి కొంత
నమ్మోచ్చు. కానీ నాకు చిన్నప్పుడు మా class teacher విజయనగర సామ్రాజ్యంలో ముత్యాలు, వజ్రాలు,రత్నాలు road పక్కన కుప్పలు పోసి అమ్మే వారని
చెప్పింది. నేను చిన్నప్పుడు నోరు వెళ్లబెట్టాను. ఇలా కూడా ఉంటుందా అని. ఆవిడ కూడా
ఏ ఉత్సాహంకల చరిత్రకారుడు చెప్పిన చరిత్ర విని ఉంటుంది. ఆ తరువాత రాయల సామ్రాజ్య పతనం, విజయనగర
దుస్థితి, అది ఎంత
హీనదశ చూసింది, ఎవడో
రాసే ఉంటాడు కానీ మనకి అఖ్ఖరలేదు. ఎందుకంటే మొదటి విషయం ఇచ్చిన kick రెండో
విషయం ఇవ్వదు. ఇది బాబు చరిత్ర.
మన
రూపాయి విలువ inflation వల్ల
పడిపోయింది.
మళ్ళీ history duping కి
వెళ్ళేముందు next post లో inflation అంటే
ఏంటి, ఏమి
చేస్తే రూపాయి విలువ పెంచొచ్చు, American economy/ current history తాలూకు
అసలు స్వరూపం ఏమిటి కొంత తెలుసుకుని Russian history లోకి గెంతుదాం.
Tuesday, June 5, 2012
ఆలోచనల స్రవంతి -31
Capitalist economy లో private పెట్టుబడిదారుడు సరుకులు అమ్మి లాభం సంపాదించి కొంత అక్కడ government కి ఇస్తాడు. Socialist economy లో government అన్ని సరుకులని కొనడం అమ్మడాన్ని regulate చేస్తుంది. Mixed లో కొన్ని government కొంత private నడుస్తుంది. ఏ దేశంలోఉత్పత్తి అయినవి అదే దేశంలో అమ్ముకుంటే national market వేరే దేశాలకి అమ్మితే international market. Demand ని బట్టి production ఉంటుంది. Production తక్కువ ఉండి demand ఎక్కువ ఉంటే ధర పెరుగుతుంది. Demand కంటే production ఎక్కువైతే ధర తగ్గుతుంది. Business చేసేవాళ్ళు తమ దగ్గిర ఉన్న సరుకు ఉత్పత్తి ధర మీద లాభం వేసుకుని అమ్ముకుంటాడు. పెట్టుబడి తన దగ్గిర ఉన్నదే పెట్టేటట్టైతే private company. ప్రజాధనం కూడా కలిపి పెడితే public limited. ఈ ప్రజాధనం పొగుచెయ్యడానికి shares collect చేస్తారు. వచ్చిన లాభాలలో ప్రజల దగ్గిర collect చేసిన shares కి proportionate గా పంచుతారు. ఈ shares కొనటం అమ్మటం జరిగే place ని share market అంటారు. అన్యాయం జరగకుండా చూడటానికి, regulate చెయ్యడానికి government ఉండనే ఉంది. మనము వేరే దేశాలకి సరుకులు ఎగుమతి చేస్తే export, దిగుబడి చేసుకుంటే import. లావాదేవీలు demand supply sequence ని బట్టి వెళుతూ ఉంటాయి.Almost అందరికీ తెలిసిందే ఇది, తెలియని వారికి కూడా చాలా simple గా అర్ధం అవుతుంది ఇప్పటి దాకా చెప్పింది. ఈ పైన చెప్పిన definitions అన్నీపుస్తకాల వరకు బాగుంటాయి. అవి చదువుతుంటే చాలా సులువుగా operate చెయ్యొచ్చు అని అనిపిస్తుంది. నిజంగా ideal conditions లో operate చేస్తే అద్భుతంగా పని చేస్తాయి. ఇంత సులువుగా ఉంటే మరి ఇన్ని అనర్ధాలు ఇంత పేదరికం ఎక్కడినించి పుడుతున్నాయి? జవాబు ఏంటంటే అవి బాగానే పని చేస్తాయి మనిషిలో స్వార్ధం పెచ్చు మీరనంతవరకు. స్వార్ధం పెచ్చు మీరినప్పుడు దాని ఫలశ్రుతి దరిద్రం, పేదరికం. ఇంతకుముందు ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యం, ఒక దేశం మీద ఇంకో దేశం యుధ్ధం చేసి గెలిచేవి,ఇప్పుడు పరిస్థితులలో అంత అవసరం లేదు. చదరంగం ఆటలో మనం రాజుని చంపము. కట్టడి చేస్తాము. అలాగే వేరే దేశం తాలూకు ఆర్ధిక పరిస్థితులని control చేస్తే ఆ దేశం automatic గా ఈ దేశం తాలూకు grip లో పడి ఉంటుంది. అదన్నమాట. ఇంతకు ముందు power play గురించి చెప్పినప్పుడు చెప్పాను, ఇప్పుడు repeat చేస్తాను.
"ఒక దేశంలో ఆర్ధిక పరిస్థితులని అక్కడి తెలివైన self -centered వెధవలని ఎగదోసి వాళ్ళ గుప్పిట్లో పెట్టించి - వాళ డబ్బులని banks లో పెట్టించి - ఆ banks ని మళ్ళీ తమ గుప్పిట్లో పెట్టుకుని -అక్కడ government ని ఈ వెధవల గుప్పిట్లోకి తోసి -ప్రపంచ బ్యాంక్లు పెట్టి ఆ దేశం అభివృద్ధికి???? ధన సాయం చేస్తూ -అప్పులకి వడ్డీలు లాగుతూ - government ని ఇరికించి -ఇంకో రకంగా డబ్బులిచ్చి దేశాలలో bombs పెట్టి మారణకాండలు జరిపి, కబ్జాలు చేసి ఒక అశాంతిని రేపి - అక్కడ ప్రజల అశాంతిని డబ్బులతో ప్రవహించే ఈ మతాల మార్పిడిలో కూరుకు పోయేలా చేసి - మత గురువులని - ఆ మతం యొక్క ఆలయాలని ముందే డబ్బులతో కొనేసి - మత మౌడ్యం తలకెక్కిన తరువాత , ప్రజల సాయంతో government ని control చేస్తూ - government సాయం తో ప్రజలని control చేస్తూ, వీళ్ళిద్దరి సాయం తో వెధవలని control చేస్తూ - -wonderful power play " -
Confessions of Economic hit man స్థూలంగా చెప్పేది self centered వెధవలని handle చెయ్యడంలో Economic hit man పాత్ర ఏంటనే. మిగతావి మనం general observation తో కొంచం common sense ఉపయోగిస్తే తేలుతుంది. ఈ రకమైన tactics వాడి అగ్రరాజ్యాలు చిన్న దేశాలని, ఎదుగుతున్న దేశాలని నాశనం చేస్తున్నాయి. మరి ఈ చిన్న దేశాలలో ఉన్న ఆ self centered వెధవలని ఆపేదెలా? మళ్ళీ ఒక శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు,మధ్వాచార్యుడు, గౌతమ బుధ్ధుడు పుట్టి ధర్మ సంస్థాపన చెయ్యాలి. మనిషికి తోటి మనుషుల మీద దయ, కారుణ్యం పెరిగేలా చెయ్యాలి. ఇది ఇప్పట్లో జరిగేలా కనపడటం లేదు.
next post లో మన రూపాయి విలువ పడిపోయింది, dollar విలువ పెరిగింది. ఎలా? మనము ఏం చేస్తే రూపాయి విలువ పెంచొచ్చు మాట్లాడుకుందాం. తరువాత history duping గురించి.
సశేషం
"ఒక దేశంలో ఆర్ధిక పరిస్థితులని అక్కడి తెలివైన self -centered వెధవలని ఎగదోసి వాళ్ళ గుప్పిట్లో పెట్టించి - వాళ డబ్బులని banks లో పెట్టించి - ఆ banks ని మళ్ళీ తమ గుప్పిట్లో పెట్టుకుని -అక్కడ government ని ఈ వెధవల గుప్పిట్లోకి తోసి -ప్రపంచ బ్యాంక్లు పెట్టి ఆ దేశం అభివృద్ధికి???? ధన సాయం చేస్తూ -అప్పులకి వడ్డీలు లాగుతూ - government ని ఇరికించి -ఇంకో రకంగా డబ్బులిచ్చి దేశాలలో bombs పెట్టి మారణకాండలు జరిపి, కబ్జాలు చేసి ఒక అశాంతిని రేపి - అక్కడ ప్రజల అశాంతిని డబ్బులతో ప్రవహించే ఈ మతాల మార్పిడిలో కూరుకు పోయేలా చేసి - మత గురువులని - ఆ మతం యొక్క ఆలయాలని ముందే డబ్బులతో కొనేసి - మత మౌడ్యం తలకెక్కిన తరువాత , ప్రజల సాయంతో government ని control చేస్తూ - government సాయం తో ప్రజలని control చేస్తూ, వీళ్ళిద్దరి సాయం తో వెధవలని control చేస్తూ - -wonderful power play " -
Confessions of Economic hit man స్థూలంగా చెప్పేది self centered వెధవలని handle చెయ్యడంలో Economic hit man పాత్ర ఏంటనే. మిగతావి మనం general observation తో కొంచం common sense ఉపయోగిస్తే తేలుతుంది. ఈ రకమైన tactics వాడి అగ్రరాజ్యాలు చిన్న దేశాలని, ఎదుగుతున్న దేశాలని నాశనం చేస్తున్నాయి. మరి ఈ చిన్న దేశాలలో ఉన్న ఆ self centered వెధవలని ఆపేదెలా? మళ్ళీ ఒక శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు,మధ్వాచార్యుడు, గౌతమ బుధ్ధుడు పుట్టి ధర్మ సంస్థాపన చెయ్యాలి. మనిషికి తోటి మనుషుల మీద దయ, కారుణ్యం పెరిగేలా చెయ్యాలి. ఇది ఇప్పట్లో జరిగేలా కనపడటం లేదు.
next post లో మన రూపాయి విలువ పడిపోయింది, dollar విలువ పెరిగింది. ఎలా? మనము ఏం చేస్తే రూపాయి విలువ పెంచొచ్చు మాట్లాడుకుందాం. తరువాత history duping గురించి.
సశేషం
Sunday, June 3, 2012
ఆలోచనల స్రవంతి - 30
American History గురించి చెప్పుకునే ముందు Perkins పుస్తకంలో Economy అనే మాట వచ్చింది కాబట్టి నాకు తెలిసిన Economics గురించి కొంచం చెబుతాను. నా పిల్లలు అడిగారు "అసలు రూపాయే ఎందుకు print చెయ్యాలి dollars print చేసుకోవచ్చు కదా" అని. దానికి సమాధానంగా నాకు తెలిసిన Economics చరిత్ర మొదలెట్టాను. నాగరికత లేని కాలంలో మనిషి అడివిలోనే బ్రతుకుతున్న సమయంలో తినదగ్గదేదైనా తింటూ బ్రతకడమే జీవితం. వేరే క్రూర మృగాల నించి తనని తను కాపాడుకోవడమే అప్పటి అవసరం. వాటి నించి కాపాడుకోవడానికి ఒక గుంపులో బ్రతకడం నేర్చిన మనిషి తరువాత తెగల క్రింద ఏర్పడి ఒక చోట కలిసికట్టుగా ఉంటూ అందరూ అడివినించి తెచ్చినవి పంచుకొని తినడం నేర్చుకున్నాడు. ఈ పంచుకోవడంలో ఉండే విబేధాలలో సమస్య పరిష్కారానికి నాయకత్వం, governance అవసరం గుర్తించి అందరిలోనూ బలమైన వాడిని నాయకుడిగా ఎన్నుకుని అతను ఎలా చెప్తే అలా నడుచుకునే పధ్ధతి నేర్చుకున్నాడు. అవసరాలు తీరిన తరువాత అవతలి తెగ వాళ్ళ మీద ఆధిపత్యం, మరింత వనరుల సమృధ్ధి, తన తెగ సుఖంగా బ్రతికదానికి వేరే తెగల వాళ్ళని బానిసలుగా వాడుకునే పధ్ధతి నేర్చుకున్నాడు. మరికొంత విస్తరించిన తన boundaries కాపాడుకోవటానికి అప్పుడు నాయకులు సైన్యాల్ని, మంత్రి సామంతుల్ని పెట్టుకుని నాగరికత పెరిగిన తరువాత రాజ్యాలుగా మార్చాడు. వ్యవసాయ పధ్ధతులు నేర్చిన మనిషి సరుకులని నిల్వ చేయడం నేర్చుకున్నాడు. అసలు వాణిజ్యం అన్నది లేని కాలం లో మొట్టమొదటిగా మనిషి చేసిన మొదటి transaction barter system ద్వారా. నా దగ్గిర బియ్యం ఉండి ఇంకొకడి దగ్గిర కట్టెలు ఉంటే కలిసి వండుకుని తినే బదులు అవతలి వాడికి కొంత బియ్యం ఇచ్చి వాడి దగ్గిర కట్టెలు తీసుకుని ఎవడికి వాడు వండుకొని తినడం అన్నమాట. Barter system గురించి ఇంకా simple గా చెప్పాలంటే బియ్యం ఇచ్చి కరివేపాకు కొనుక్కోవడం. ఆంధ్రలో నా చిన్నప్పుడు almost 1980s వరకు ఈ transaction ఉండేది. ఈ transactions స్థాయి పెరిగినప్పుడు ఎంత బియ్యానికి ఎన్ని కట్టెలు అని చెప్పలేనప్పుడు ఎవరైతే పరిపాలనలో ఉన్నారో వారు వాణిజ్య సౌలభ్యం కొరకు మారకాన్ని అంటే currencyని introduce చెయ్యడం జరిగింది. ఇంతకుముందు ఈ currency రాజుల పరిపాలనలో gold coins ,silver coins ని వాడే వారు. రాజుల రాజ్యాలు పోయి ప్రజా రాజ్యాలు వచ్చిన తరువాత అది ఏ రకమైన economy అయినా Capitalist, Socialist, Mixed etc., కొన్నాళ్లు copper coins ఉన్న తరువాత paper currency వచ్చింది. అవే ఇప్పుడు మనం చూసే రూపాయలు, dollarలు , euroలు. మధ్యలో మహమ్మద్ బీన్ తుగ్లక్ తోలు currency పెట్టాడు. అది ఇంకో చరిత్ర ఘట్టం. వేరు వేరు దేశాలలో వేరు వేరు currency లు. ఏ Economy అయినా rates regulate చేసేది ఆ దేశపు Government.
Duping History కి తిరిగి వచ్చే ముందు next posts లో trading, global market, share markets గురించి మాట్లాడుకుందాం.
సశేషం
Duping History కి తిరిగి వచ్చే ముందు next posts లో trading, global market, share markets గురించి మాట్లాడుకుందాం.
సశేషం
Wednesday, May 30, 2012
ఆలోచనల స్రవంతి - 29
duping history contd......
నేను confuse అయ్యాను. ఎందుకంటే చెలం ప్రకారం గాంధీ మహాత్ముడు. మా సన్యాసిరావు మాస్టర్ ప్రకారం పనికి రాని వాడు. ఆ confusion లో నేను గాంధీ వ్రాసిన "My experiments with truth" చదివాను. చెలం చెప్పింది నిజమనిపించింది. కానీ నేను చదివిన చరిత్ర పుస్తకాల inference తో నాకు అనిపించింది ఏంటంటే 1915 నించి 1947 వరకు జరిగిన independence struggle లో రకరకాల situations లో ఆయన handle చేసిన తీరు ఆయన గొప్ప individual, గొప్ప leader అని prove చేస్తాయి కానీ మంచి administrator కాదన్న విషయాన్ని చెప్పకనే చెబుతాయి. నాకు ఆయన అందరినీ కలుపుకుంటూ ఎవరికీ కష్టం కలగకుండా చెయ్యాలని ప్రయత్నించడం అర్ధం లేదనిపించింది. నా ఆవేశానికి సుభాష్ చంద్ర బొస్ correct అనిపించాడు. స్వతంత్రం అన్నది ఎవడో ఇస్తే తీసుకునేది కాదు, యుధ్ధం చేసైనా గెలిచి సంపాదించాలనే concept correct అనిపించింది. స్వతంత్రం వస్తే ఏమి చేయాలన్న agenda బొస్ అతని team తయారుచేస్తే అది approve కాకపోవడం, గాంధీ గారి మాటలతో బొస్ కూడా ఆగడం, గాంధీగారు almost నెహ్రూగారు చెప్పింది చెయ్యడం, నెహ్రూగారి political handling sequences, నాకు గాంధీగారి integrity గురించి కాదు కానీ ఆయన understanding of situations మీద అపనమ్మకం ఏర్పడింది. ఆయన vision మంచిదే కానీ ఆయన అనుయాయులు ఆయన విధానాల్ని దెబ్బతీసిన తీరు,ఖిలాఫత్ అని ముస్లిములు ఆయనకి దూరమైన తీరు, నవఖలీ లో హిందూల మీద జరిగిన అత్యాచారానికి ఆయన స్పందించిన తీరు, partition time లో ముస్లిం లీగ్ జిన్నా, Poona pact time లో అంబేద్కర్ అతని team blackmail చేసి commitments తీసుకున్న తీరు, power కోసం నెహ్రూగారు చేసిన విన్యాసాలు, ఇలాటివన్నీ చదివిన తరువాత అప్పుడు కొంత మా మాస్టర్ గారి మాటలకి justification దొరికినట్టు అనిపించింది. కారా మాస్టరు గారు వ్రాసిన కుట్ర కథ చదివి history కి ఇంకో angle తెలుసుకున్నాను. ఇందులో history duping ఎంటయ్యా నువ్వు కూడా ఎక్కడో చదివి తెలుసుకున్నదే కదా అంటే, వెతుక్కుని ఎవాడేవడో వ్రాసినవన్నీ చదివి కొంత ఊహించి, కొంత క్రోడీకరించి అర్ధం చేసుకుని ఓహో ఇదా అనుకోవడం తప్పిస్తే అసలేం జరిగిందో ఎవడికి తెలుసు. Result అర్ధం అవుతుంది కానీ ఏ situation నించి ఈ result వచ్చిందో ఎలా తెలుస్తుంది.
నేను confuse అయ్యాను. ఎందుకంటే చెలం ప్రకారం గాంధీ మహాత్ముడు. మా సన్యాసిరావు మాస్టర్ ప్రకారం పనికి రాని వాడు. ఆ confusion లో నేను గాంధీ వ్రాసిన "My experiments with truth" చదివాను. చెలం చెప్పింది నిజమనిపించింది. కానీ నేను చదివిన చరిత్ర పుస్తకాల inference తో నాకు అనిపించింది ఏంటంటే 1915 నించి 1947 వరకు జరిగిన independence struggle లో రకరకాల situations లో ఆయన handle చేసిన తీరు ఆయన గొప్ప individual, గొప్ప leader అని prove చేస్తాయి కానీ మంచి administrator కాదన్న విషయాన్ని చెప్పకనే చెబుతాయి. నాకు ఆయన అందరినీ కలుపుకుంటూ ఎవరికీ కష్టం కలగకుండా చెయ్యాలని ప్రయత్నించడం అర్ధం లేదనిపించింది. నా ఆవేశానికి సుభాష్ చంద్ర బొస్ correct అనిపించాడు. స్వతంత్రం అన్నది ఎవడో ఇస్తే తీసుకునేది కాదు, యుధ్ధం చేసైనా గెలిచి సంపాదించాలనే concept correct అనిపించింది. స్వతంత్రం వస్తే ఏమి చేయాలన్న agenda బొస్ అతని team తయారుచేస్తే అది approve కాకపోవడం, గాంధీ గారి మాటలతో బొస్ కూడా ఆగడం, గాంధీగారు almost నెహ్రూగారు చెప్పింది చెయ్యడం, నెహ్రూగారి political handling sequences, నాకు గాంధీగారి integrity గురించి కాదు కానీ ఆయన understanding of situations మీద అపనమ్మకం ఏర్పడింది. ఆయన vision మంచిదే కానీ ఆయన అనుయాయులు ఆయన విధానాల్ని దెబ్బతీసిన తీరు,ఖిలాఫత్ అని ముస్లిములు ఆయనకి దూరమైన తీరు, నవఖలీ లో హిందూల మీద జరిగిన అత్యాచారానికి ఆయన స్పందించిన తీరు, partition time లో ముస్లిం లీగ్ జిన్నా, Poona pact time లో అంబేద్కర్ అతని team blackmail చేసి commitments తీసుకున్న తీరు, power కోసం నెహ్రూగారు చేసిన విన్యాసాలు, ఇలాటివన్నీ చదివిన తరువాత అప్పుడు కొంత మా మాస్టర్ గారి మాటలకి justification దొరికినట్టు అనిపించింది. కారా మాస్టరు గారు వ్రాసిన కుట్ర కథ చదివి history కి ఇంకో angle తెలుసుకున్నాను. ఇందులో history duping ఎంటయ్యా నువ్వు కూడా ఎక్కడో చదివి తెలుసుకున్నదే కదా అంటే, వెతుక్కుని ఎవాడేవడో వ్రాసినవన్నీ చదివి కొంత ఊహించి, కొంత క్రోడీకరించి అర్ధం చేసుకుని ఓహో ఇదా అనుకోవడం తప్పిస్తే అసలేం జరిగిందో ఎవడికి తెలుసు. Result అర్ధం అవుతుంది కానీ ఏ situation నించి ఈ result వచ్చిందో ఎలా తెలుస్తుంది.
American history గురించి నాకు చాలా గొప్ప అభిప్రాయం ఉండేది. John.F. Kennedy quotation " Don't ask what your country can do for you, but see what you can do for your country" అనేది నా favorite quotes లో ఒకటి. Pre-Columbian, Colonization era ల గురించి మాట్లాడను కానీ ఆ తరువాత వాళ్ళు super power కింద ఎదిగిన విధానం నాకు ఆశ్చర్యం కలిగించేది, John Perkins వ్రాసిన "Confessions of an Economic hit man" చదివే వరకు.
సశేషం
Tuesday, May 29, 2012
ఆలోచనల స్రవంతి - 28
history duping contd.......
My friend while commenting on my post said "You have to understand the difference between happening and writing" - Accepted - My say is further we need to understand so many differences that rise in the gaps of feeling to conveying, conveying to understanding, understanding to reciprocating, reciprocating to reproducing, reproducing to publishing, publishing to campaigning, campaigning to mass feeling to again conveying and so many other differences are there which are never ending and the cycles follow.
I say "Truths, facts are absolute, happenings are contemporary, and scripted History is merely a view point"
నేను ఇంతకు ముందు media గురించిన చర్చలో power లో ఉన్నవాడు తనకు అనుకూలంగా వాడుకునే సాధనం అన్నాను. ఒక తరం నించి ఇంకో తరానికి చరిత్రని pass చేసే సాధనం కూడా media నే. ఈ మాధ్యమం ఉపయోగించుకుని పాలకవర్గం, గెలిచిన పక్షం ఎప్పుడూ వాళ్ళని వాళ్ళు elevate చేసుకునే విధంగా ప్రచారం జరుగుతుంది. అసలు నిజం చరిత్రలో శిధిలమైపోతుంది. ఈ నిజం కూడా ఎవడికి అర్ధమైనది వాడికే నిజం.
గత చరిత్ర గురించి ఇంకోసారి మాట్లాడుకునే ముందు latest current affairs in Andhra గురించి ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా ఆస్తులు కూడబెట్టడాని arrest చేశారు. కానీ సాక్షి tv చూస్తే అతనంత ఉత్తముడు, ధీరోదాత్తుడు ఇంకోడు కనపడడు. అదే tv లో ysr గాంధీ తరువాత గాంధీ అంతటి వాడు. విజయమ్మ గారిని అడిగితే ఆవిడ బిడ్డ అంత అమాయకుడు ఇంకెవరూ లేరని, జగన్ ని అకారణంగా arrest చేశారని ఆవిడ ఆవేదన. అలాగే ఈtv చూస్తే అతనంత దారుణమైన మనిషి కనపడడు. ysr గురించి చంద్రబాబు ని చంద్రబాబు గురించి కాంగ్రెస్ నేతలనీ, వీళ్ళిద్దరి గురించి bjp ని, వాళ్ళ గురించి communists ని అడిగితే ఎవడి version వాడికి ఉంటుంది. నిజమేంటంటే అందరూ ఎవడి స్వలాభం వాళ్ళు చూసుకుంటున్నారు. జనాలు అలవాటు పడిపోయారు.
మా సన్యాసిరావు మాస్టర్ గాంధీగారిని తిట్టేవారు. ఆయన ఉద్దేశ్యం ప్రకారం గాంధీ వల్లే పాకిస్తాన్ వేరు పడిందని, స్వతంత్రం రావడానికి గాంధీ సత్యాగ్రహం కారణం కాదని, English వాళ్ళు ప్రపంచయుధ్ధం లో వారి దేశాన్ని వాళ్ళే కాపాడుకోవటానికి కష్టపడాల్సి వచ్చిందని, అప్పుడు భారతదేశాన్ని పరిపాలించడానికి కష్టమై వదిలి వెళ్లిపోయారని, అప్పటి వరకు వారు తయారు చేసిన Indian regiments ని కూడా యుధ్ధం లో వాడుకోవాల్సి వచ్చిందని ఇలా రకరకాలుగా చెప్పేవారు. ఆయన చెప్పేవరకు 9th std వరకు నాకు గాంధీ జాతిపిత. ఆయన వలనే స్వతంత్రం వచ్చింది. గాంధీ మహాత్ముడు. ఆయన చెప్పింది విని చరిత్రని వేరే కోణం లోంచి చూడొచ్చు అని తెలుసుకున్నాను. నాకు చెలం మ్యూజింగ్స్ చదివే వరకు నాకు గాంధీ గురించి ఆయన చెప్పిన అభిప్రాయం లోనే ఉండేవాడిని.
సశేషం
My friend while commenting on my post said "You have to understand the difference between happening and writing" - Accepted - My say is further we need to understand so many differences that rise in the gaps of feeling to conveying, conveying to understanding, understanding to reciprocating, reciprocating to reproducing, reproducing to publishing, publishing to campaigning, campaigning to mass feeling to again conveying and so many other differences are there which are never ending and the cycles follow.
I say "Truths, facts are absolute, happenings are contemporary, and scripted History is merely a view point"
నేను ఇంతకు ముందు media గురించిన చర్చలో power లో ఉన్నవాడు తనకు అనుకూలంగా వాడుకునే సాధనం అన్నాను. ఒక తరం నించి ఇంకో తరానికి చరిత్రని pass చేసే సాధనం కూడా media నే. ఈ మాధ్యమం ఉపయోగించుకుని పాలకవర్గం, గెలిచిన పక్షం ఎప్పుడూ వాళ్ళని వాళ్ళు elevate చేసుకునే విధంగా ప్రచారం జరుగుతుంది. అసలు నిజం చరిత్రలో శిధిలమైపోతుంది. ఈ నిజం కూడా ఎవడికి అర్ధమైనది వాడికే నిజం.
గత చరిత్ర గురించి ఇంకోసారి మాట్లాడుకునే ముందు latest current affairs in Andhra గురించి ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా ఆస్తులు కూడబెట్టడాని arrest చేశారు. కానీ సాక్షి tv చూస్తే అతనంత ఉత్తముడు, ధీరోదాత్తుడు ఇంకోడు కనపడడు. అదే tv లో ysr గాంధీ తరువాత గాంధీ అంతటి వాడు. విజయమ్మ గారిని అడిగితే ఆవిడ బిడ్డ అంత అమాయకుడు ఇంకెవరూ లేరని, జగన్ ని అకారణంగా arrest చేశారని ఆవిడ ఆవేదన. అలాగే ఈtv చూస్తే అతనంత దారుణమైన మనిషి కనపడడు. ysr గురించి చంద్రబాబు ని చంద్రబాబు గురించి కాంగ్రెస్ నేతలనీ, వీళ్ళిద్దరి గురించి bjp ని, వాళ్ళ గురించి communists ని అడిగితే ఎవడి version వాడికి ఉంటుంది. నిజమేంటంటే అందరూ ఎవడి స్వలాభం వాళ్ళు చూసుకుంటున్నారు. జనాలు అలవాటు పడిపోయారు.
మా సన్యాసిరావు మాస్టర్ గాంధీగారిని తిట్టేవారు. ఆయన ఉద్దేశ్యం ప్రకారం గాంధీ వల్లే పాకిస్తాన్ వేరు పడిందని, స్వతంత్రం రావడానికి గాంధీ సత్యాగ్రహం కారణం కాదని, English వాళ్ళు ప్రపంచయుధ్ధం లో వారి దేశాన్ని వాళ్ళే కాపాడుకోవటానికి కష్టపడాల్సి వచ్చిందని, అప్పుడు భారతదేశాన్ని పరిపాలించడానికి కష్టమై వదిలి వెళ్లిపోయారని, అప్పటి వరకు వారు తయారు చేసిన Indian regiments ని కూడా యుధ్ధం లో వాడుకోవాల్సి వచ్చిందని ఇలా రకరకాలుగా చెప్పేవారు. ఆయన చెప్పేవరకు 9th std వరకు నాకు గాంధీ జాతిపిత. ఆయన వలనే స్వతంత్రం వచ్చింది. గాంధీ మహాత్ముడు. ఆయన చెప్పింది విని చరిత్రని వేరే కోణం లోంచి చూడొచ్చు అని తెలుసుకున్నాను. నాకు చెలం మ్యూజింగ్స్ చదివే వరకు నాకు గాంధీ గురించి ఆయన చెప్పిన అభిప్రాయం లోనే ఉండేవాడిని.
సశేషం
Monday, May 28, 2012
ఆలోచనల స్రవంతి -27
Duping History contd....
నేను వాల్మీకి రామాయణం ఎలా చదవలేదో అలాగే Bible కూడా చదవలేదు. Dan Brown వ్రాసిన అన్ని పుస్తకాలు చదివాను. అందులో " The Davinci Code" , "Angels & Demons" లో Jesus Christ మీద చాలా చర్చ ఉంది. Bible మీద నాకు ఒక అభిప్రాయం ఏర్పడడానికి నా చిన్నప్పటి సంగతులు కొన్ని చెబుతాను. నా చిన్నప్పుడు RTC Complex, Vizag దగ్గిర ఉండే cemetery గోడ మీద ఇలా వ్రాసి ఉండేది. " దేముడు ఆకాశమంత పాపము చేసి ఉన్నాడు. నీవెంతటి పాపము చెయ్యగలవు" ఇంకా దాని continuation లో "పాపులారా యేసు తన రక్తముతో మిమ్మల్ని పునీతుల్ని చేయును" - ఈ quotes అప్పుడు అర్ధం కాలేదు. కొంత నవ్వు కూడా వచ్చేది. అవి ఆ తరువాత అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించ లేదు. ఎందుకంటే VT College, Sivalayam branch లో మాకు చావలి సన్యాసిరావు గారు principal ఇంకా matriculation కి English పాఠాలు చెప్పేవారు. ఆయన class లో ఏదో lesson చెప్తూ Christianity India లో ప్రచారం చేసేటప్పుడు ఆ ప్రచారకులు తెలుగు తెలియక dictionary పక్కన పెట్టుకుని మక్కీ కి మక్కీ translation నించి problem అని చెబుతూ "Our field of service extends from Visakhapatnam to Anakapalli" అనడానికి అనువాదం "మా పొలము Visakhapatnam to Anakapalli వరకు విస్తరించి ఉన్నది" అంటారని ఎవడో "అయ్యా మధ్యలో నా పొలం ఉందా పోయిందా" అని గాభరాపడ్డాడని joke లాగా చెప్పేవారు. దానితో clarity వచ్చిన నేను ఆ quotes ని వదిలేశాను.
నాకు Jesus గురించి తెలియడానికి ముఖ్య కారణం విశాఖలో ఉన్న కన్నెమారమ్మ కొండ. అక్కడ church లో ఏడాదికి ఒకసారి పెద్ద ఉత్సవం జరిగేది. ఒకే ఒక్కసారి వెళ్ళాను. old post office వరకు బస్సులో వెళ్ళి అక్కడి నించి నడకదారిలో కొండ ఎక్కాలి. చాలా జనసందోహం, దారిపొడుగునా దుకాణాలు చాలా సరదాగా ఉండేది. ఎక్కేటప్పుడు దారి మధ్యలో ఒక muslim అతను నిలబడి pamphlets పంచుతూ "క్రీస్తు భగవంతుడు కాదు" అని అరుస్తూ నిలబడ్డాడు. వీడు ఎందుకు ఇలా అరుస్తున్నాడు అని అనుమానం కలిగింది. కానీ వాడి దగ్గిరకి వెళ్లలేదు. తెలియదు కానీ ఎందుకో ఒక రకమైన భయం వేసింది. ఇక అసలు విషయానికి వద్దాం.
Jesus ఒక మహాత్ముడు, ప్రజల మంచి కోసం నిలబడ్డాడు అని అనడానికి ఎటువంటి సంకోచం ఉండదు. కానీ అతన్ని భగవంతుడి కింద మార్చడానికి అతను ఒక కన్యకి పుట్టాడు, అద్భుతాలు చేశాడు, చావు నించి పుట్టాడు, స్వర్గం వెళ్ళాడు, తిరిగి జన్మిస్తాడు అంటే అది ఎవడిది వాడి individual నమ్మకానికి వదిలేయాలి.
ఈ DanBrown పుస్తకం చదివిన తరువాత వాడు చెప్పిన దానితో అర్ధమైన విషయాలు ఏంటంటే Jesus అనే అతను ఒక యూదు రాజు, mary magadalene అన్న ఆవిడని పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కన్నాడు. అతన్ని శిలువ వేసిన తరువాత అతని వంశాన్ని కాపాడడానికి ఒక group అతని family ని underground కి తీసుకుపోయింది. ఇప్పటికీ jesus వంశస్థులు బతికే ఉన్నారు. ఇందులో ఇంకేమీ దైవత్వం కనపడదు. మంచి పేరు తెచ్చుకున్న యూదు రాజుని రోమన్లు, అతని కీర్తిని భరించలేక కుట్ర చేసి, arrest చేసి, విచారణ చేసి, శిలువ వేసి చంపేసి అతని అనుయాయుల్ని కొనేసి, christian విధానంలో రోమన్ ఆచారాల్ని కలిపేసి తమ ఉనికిని కాపాడుకొని Christianity flag కింద తమ power restore చేసుకున్నారని ఒక కథనం. రామాయణం గురించి last post లో rk గాడి comment లాగా అసలు క్రీస్తు ఉన్నాడా లేదా అని ఒక argument. ఇంక రామాయణం 200 varieties ఉన్నట్టు దీనిలో old testament, new testament ఎవడి ఓపికని బట్టీ వాడు చెప్పుకుంటూ పోవడమే. ఈ క్రీస్తుని messiah కింద ఇస్లాం లో గుర్తించారని ఒక కథనం. బుద్ధుడు విష్ణువు తాలూకు తొమ్మిదో అవతారం లాగా. ఈ మతాలన్నీ ఎప్పటికప్పుడు update అవుతూ latest trend కి తగ్గట్టుగా మారుతూ పోతూ ఉంటాయి.
next post లో నాకు తెలిసిన ఇంకొన్ని history duping సంగతులు
సశేషం
నేను వాల్మీకి రామాయణం ఎలా చదవలేదో అలాగే Bible కూడా చదవలేదు. Dan Brown వ్రాసిన అన్ని పుస్తకాలు చదివాను. అందులో " The Davinci Code" , "Angels & Demons" లో Jesus Christ మీద చాలా చర్చ ఉంది. Bible మీద నాకు ఒక అభిప్రాయం ఏర్పడడానికి నా చిన్నప్పటి సంగతులు కొన్ని చెబుతాను. నా చిన్నప్పుడు RTC Complex, Vizag దగ్గిర ఉండే cemetery గోడ మీద ఇలా వ్రాసి ఉండేది. " దేముడు ఆకాశమంత పాపము చేసి ఉన్నాడు. నీవెంతటి పాపము చెయ్యగలవు" ఇంకా దాని continuation లో "పాపులారా యేసు తన రక్తముతో మిమ్మల్ని పునీతుల్ని చేయును" - ఈ quotes అప్పుడు అర్ధం కాలేదు. కొంత నవ్వు కూడా వచ్చేది. అవి ఆ తరువాత అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించ లేదు. ఎందుకంటే VT College, Sivalayam branch లో మాకు చావలి సన్యాసిరావు గారు principal ఇంకా matriculation కి English పాఠాలు చెప్పేవారు. ఆయన class లో ఏదో lesson చెప్తూ Christianity India లో ప్రచారం చేసేటప్పుడు ఆ ప్రచారకులు తెలుగు తెలియక dictionary పక్కన పెట్టుకుని మక్కీ కి మక్కీ translation నించి problem అని చెబుతూ "Our field of service extends from Visakhapatnam to Anakapalli" అనడానికి అనువాదం "మా పొలము Visakhapatnam to Anakapalli వరకు విస్తరించి ఉన్నది" అంటారని ఎవడో "అయ్యా మధ్యలో నా పొలం ఉందా పోయిందా" అని గాభరాపడ్డాడని joke లాగా చెప్పేవారు. దానితో clarity వచ్చిన నేను ఆ quotes ని వదిలేశాను.
నాకు Jesus గురించి తెలియడానికి ముఖ్య కారణం విశాఖలో ఉన్న కన్నెమారమ్మ కొండ. అక్కడ church లో ఏడాదికి ఒకసారి పెద్ద ఉత్సవం జరిగేది. ఒకే ఒక్కసారి వెళ్ళాను. old post office వరకు బస్సులో వెళ్ళి అక్కడి నించి నడకదారిలో కొండ ఎక్కాలి. చాలా జనసందోహం, దారిపొడుగునా దుకాణాలు చాలా సరదాగా ఉండేది. ఎక్కేటప్పుడు దారి మధ్యలో ఒక muslim అతను నిలబడి pamphlets పంచుతూ "క్రీస్తు భగవంతుడు కాదు" అని అరుస్తూ నిలబడ్డాడు. వీడు ఎందుకు ఇలా అరుస్తున్నాడు అని అనుమానం కలిగింది. కానీ వాడి దగ్గిరకి వెళ్లలేదు. తెలియదు కానీ ఎందుకో ఒక రకమైన భయం వేసింది. ఇక అసలు విషయానికి వద్దాం.
Jesus ఒక మహాత్ముడు, ప్రజల మంచి కోసం నిలబడ్డాడు అని అనడానికి ఎటువంటి సంకోచం ఉండదు. కానీ అతన్ని భగవంతుడి కింద మార్చడానికి అతను ఒక కన్యకి పుట్టాడు, అద్భుతాలు చేశాడు, చావు నించి పుట్టాడు, స్వర్గం వెళ్ళాడు, తిరిగి జన్మిస్తాడు అంటే అది ఎవడిది వాడి individual నమ్మకానికి వదిలేయాలి.
ఈ DanBrown పుస్తకం చదివిన తరువాత వాడు చెప్పిన దానితో అర్ధమైన విషయాలు ఏంటంటే Jesus అనే అతను ఒక యూదు రాజు, mary magadalene అన్న ఆవిడని పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కన్నాడు. అతన్ని శిలువ వేసిన తరువాత అతని వంశాన్ని కాపాడడానికి ఒక group అతని family ని underground కి తీసుకుపోయింది. ఇప్పటికీ jesus వంశస్థులు బతికే ఉన్నారు. ఇందులో ఇంకేమీ దైవత్వం కనపడదు. మంచి పేరు తెచ్చుకున్న యూదు రాజుని రోమన్లు, అతని కీర్తిని భరించలేక కుట్ర చేసి, arrest చేసి, విచారణ చేసి, శిలువ వేసి చంపేసి అతని అనుయాయుల్ని కొనేసి, christian విధానంలో రోమన్ ఆచారాల్ని కలిపేసి తమ ఉనికిని కాపాడుకొని Christianity flag కింద తమ power restore చేసుకున్నారని ఒక కథనం. రామాయణం గురించి last post లో rk గాడి comment లాగా అసలు క్రీస్తు ఉన్నాడా లేదా అని ఒక argument. ఇంక రామాయణం 200 varieties ఉన్నట్టు దీనిలో old testament, new testament ఎవడి ఓపికని బట్టీ వాడు చెప్పుకుంటూ పోవడమే. ఈ క్రీస్తుని messiah కింద ఇస్లాం లో గుర్తించారని ఒక కథనం. బుద్ధుడు విష్ణువు తాలూకు తొమ్మిదో అవతారం లాగా. ఈ మతాలన్నీ ఎప్పటికప్పుడు update అవుతూ latest trend కి తగ్గట్టుగా మారుతూ పోతూ ఉంటాయి.
next post లో నాకు తెలిసిన ఇంకొన్ని history duping సంగతులు
సశేషం
Friday, May 25, 2012
ఆలోచనల స్రవంతి - 26
Duping History contd.....
వాల్మీకి రామాయణం నేను చదవలేదు. అలాగని కంబ రామాయణం కూడా చదవలేదు. కానీ వాటి మీద వ్యాసాలు చదివాను. నార్ల వెంకటేశ్వరరావు గారి జాబాలి నాటకం చదివాను. దాని ముందు మాటలో ఆయన ప్రక్షిప్తాలు గురించి చర్చ చేశారు. ఆయన చెప్పినడాని ప్రకారం ఆదికవి అనుస్టుప్ చందంలో వ్రాసిన అసలు రామాయణం చాలా రసవత్తరంగా ఉంటుంది. ఆరు కాండలలో శ్రీరామ పట్టాభిషేకంతో ముగుస్తుంది. అందులో రాముడు సామాన్యుడు. అతనితో ఉండే వానరగణం కూడా ఖగోళ శాస్త్రం లాటి శాస్త్రాలలో ఆరితేరినవారు కారు. కానీ కాలక్రమేణా వేరు వేరు కాలాలలో వేరు వేరు కవులు వారికి తెలిసిన, అప్పటి పరిస్తితులలో discover చేసిన, కొత్త విషయాలనన్నిటిని చేర్చి దాన్నిఉద్గ్రంధం చేసేశారు. ఈ ప్రక్షిప్తాలు చేరిన తరువాత వానర ప్రముఖుడైన నీలుడు అప్పటి వరకు అయోమయంలో ఉండి sudden గా ఖగోళశాస్త్ర వర్ణన మొదలెడతాడు అని వ్రాసారు. దాదాపు 200 రామాయణాలు ఉన్నాయిట. కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అని ఎవడికి తోచిన రామాయణం వాడు చెప్పడమే. వాల్మీకి రామాయణంలో రావణాసురుడు సీతని, చెల్లెలికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా, ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోయిన తరువాత మోహిస్తాడు. పెళ్లాడమని అడుగుతాడు. రాముడు ఎన్నో ప్రయాసలతో చివరికి రావణున్ని చంపి తిరిగి సీతని తెచ్చుకుంటాడు. ఒక hero, ఒక heroine, ఒక villain, love, emotion, revenge formula, సుఖాంతం. ఇప్పుడు కంబ రామాయణం చూస్తే అసలు సీత రావణాసురుడి కూతురట. అడవిలో సీత పడుతున్న కష్టాలు చూసి ఓర్వలేని తండ్రి కూతురుని తిరిగి తెచ్చుకుంటే, రాముడు ఇవ్వమని అడిగితే, ఇవ్వనన్న తండ్రిని చంపి భార్యని తెచ్చుకుంటాడు. ఇదెలా ఉంది. melodrama ఉంది కానీ, రాముడికి ఆపాదించిన పురుషోత్తమ లక్షణాలన్నీమాయమయిపోతాయి. అసలు రావణాసురుడు పంచభూతాలని control చెయ్యగల బలశాలి. అలాటిది రామ బాణం తో బొడ్డు క్రింద కొట్టి చంపేస్తాడు. అసలు యుధ్ధనీతి బాహ్యమైన పని. ఇదెలా ధర్మం. ఇంకా simple గా సూక్ష్మం ఏమిటంటే వాల్మీకిది ఆర్యులు వ్రాసిన కథ, కంబ రామాయణం ద్రావిడులు వ్రాసిన కథ. ఎవడి ఓపిక బట్టీ వాడు నమ్మడమే. మనమా కాలంలో లేము. పెద్దలు ఏది చెబితే అది నమ్మడమే. రామాయణం జరిగింది అనడానికి ఆధారాలు, ఆనవాళ్ళు, అన్నీ ఉన్నాయి. కానీ నిజంగా ఏమి జరిగిందో ఎవడికీ clarity ఉండదు. ఎవడి ఓపిక,interest బట్టి వాడు రామాయణం twist చేసేయొచ్చు. మన సినిమా వాళ్ళకైతే ఇంకా liberty. మనమిలా వాదిస్తే వేదాలు చదివిన పెద్దలు నీకు ధర్మ సూక్ష్మాలు తెలియవని రాముడు చేసిన ప్రతీ పనికి justification ఇస్తూ రాముడు భగవంతుడి అవతారం అని confirm చేసేస్తారు. ఇన్ని చెప్పిన నాకు చిన్నప్పటి నించి వింటున్న రామాయణం అంటే ఎంతో ఇష్టం.
next post లో నాకు తెలిసిన క్రీస్తు చరిత్ర
సశేషం
వాల్మీకి రామాయణం నేను చదవలేదు. అలాగని కంబ రామాయణం కూడా చదవలేదు. కానీ వాటి మీద వ్యాసాలు చదివాను. నార్ల వెంకటేశ్వరరావు గారి జాబాలి నాటకం చదివాను. దాని ముందు మాటలో ఆయన ప్రక్షిప్తాలు గురించి చర్చ చేశారు. ఆయన చెప్పినడాని ప్రకారం ఆదికవి అనుస్టుప్ చందంలో వ్రాసిన అసలు రామాయణం చాలా రసవత్తరంగా ఉంటుంది. ఆరు కాండలలో శ్రీరామ పట్టాభిషేకంతో ముగుస్తుంది. అందులో రాముడు సామాన్యుడు. అతనితో ఉండే వానరగణం కూడా ఖగోళ శాస్త్రం లాటి శాస్త్రాలలో ఆరితేరినవారు కారు. కానీ కాలక్రమేణా వేరు వేరు కాలాలలో వేరు వేరు కవులు వారికి తెలిసిన, అప్పటి పరిస్తితులలో discover చేసిన, కొత్త విషయాలనన్నిటిని చేర్చి దాన్నిఉద్గ్రంధం చేసేశారు. ఈ ప్రక్షిప్తాలు చేరిన తరువాత వానర ప్రముఖుడైన నీలుడు అప్పటి వరకు అయోమయంలో ఉండి sudden గా ఖగోళశాస్త్ర వర్ణన మొదలెడతాడు అని వ్రాసారు. దాదాపు 200 రామాయణాలు ఉన్నాయిట. కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అని ఎవడికి తోచిన రామాయణం వాడు చెప్పడమే. వాల్మీకి రామాయణంలో రావణాసురుడు సీతని, చెల్లెలికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా, ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోయిన తరువాత మోహిస్తాడు. పెళ్లాడమని అడుగుతాడు. రాముడు ఎన్నో ప్రయాసలతో చివరికి రావణున్ని చంపి తిరిగి సీతని తెచ్చుకుంటాడు. ఒక hero, ఒక heroine, ఒక villain, love, emotion, revenge formula, సుఖాంతం. ఇప్పుడు కంబ రామాయణం చూస్తే అసలు సీత రావణాసురుడి కూతురట. అడవిలో సీత పడుతున్న కష్టాలు చూసి ఓర్వలేని తండ్రి కూతురుని తిరిగి తెచ్చుకుంటే, రాముడు ఇవ్వమని అడిగితే, ఇవ్వనన్న తండ్రిని చంపి భార్యని తెచ్చుకుంటాడు. ఇదెలా ఉంది. melodrama ఉంది కానీ, రాముడికి ఆపాదించిన పురుషోత్తమ లక్షణాలన్నీమాయమయిపోతాయి. అసలు రావణాసురుడు పంచభూతాలని control చెయ్యగల బలశాలి. అలాటిది రామ బాణం తో బొడ్డు క్రింద కొట్టి చంపేస్తాడు. అసలు యుధ్ధనీతి బాహ్యమైన పని. ఇదెలా ధర్మం. ఇంకా simple గా సూక్ష్మం ఏమిటంటే వాల్మీకిది ఆర్యులు వ్రాసిన కథ, కంబ రామాయణం ద్రావిడులు వ్రాసిన కథ. ఎవడి ఓపిక బట్టీ వాడు నమ్మడమే. మనమా కాలంలో లేము. పెద్దలు ఏది చెబితే అది నమ్మడమే. రామాయణం జరిగింది అనడానికి ఆధారాలు, ఆనవాళ్ళు, అన్నీ ఉన్నాయి. కానీ నిజంగా ఏమి జరిగిందో ఎవడికీ clarity ఉండదు. ఎవడి ఓపిక,interest బట్టి వాడు రామాయణం twist చేసేయొచ్చు. మన సినిమా వాళ్ళకైతే ఇంకా liberty. మనమిలా వాదిస్తే వేదాలు చదివిన పెద్దలు నీకు ధర్మ సూక్ష్మాలు తెలియవని రాముడు చేసిన ప్రతీ పనికి justification ఇస్తూ రాముడు భగవంతుడి అవతారం అని confirm చేసేస్తారు. ఇన్ని చెప్పిన నాకు చిన్నప్పటి నించి వింటున్న రామాయణం అంటే ఎంతో ఇష్టం.
next post లో నాకు తెలిసిన క్రీస్తు చరిత్ర
సశేషం
Monday, May 21, 2012
ఆలోచనల స్రవంతి -25
నేను facebook లో post చేసిన కవిత blog లో పెట్టడానికి చాలా రోజుల తరువాత blog ఓపెన్ చేసి చూస్తే, ఎవరో ఒకరు, రోజుకో పది మంది చూస్తున్నారు అని తెలిసి చాలా సంతోషం అనిపించింది. నాకు తెలిసి నాది చాలా చిన్న friends circle. ఈ మధ్యే facebook పుణ్యమా అని నా matriculation friends కలిశారు ఒక పదిహేను మంది. అందులో ఒకళ్ళిద్దరికి తప్పితే మిగిలిన ఎవరికీ కనీసం ఇలాటి blogs interest ఉన్నట్టు కనపడలేదు. మిగిలింది rk &team. వాళ్ళకి నా కృతజ్ఞ్యతలు. కనీసం చదివే పదిమందికి ఏదో నా ఆలోచన పంచుకుంటే బాగుంటుందని అనిపించి at the same time వ్రాయాలనే weakness వదలక మళ్ళీ ఇదిగో ఇలా.
ఇంతకుముందు posts లో నేను మళ్ళీ మాట్లాడుకుందాం అని వదిలేసిన topics
1. Duping of history
2. Share markets
3. Human psychology గురించి నాకు తెలిసింది
5. Hinduism, Islam , Christianity , Buddhism వీటి పయనమెటు
6. How science advancement leads to God -దీని మీద ఎంతో కొంత వ్రాసి Fritjof Capra చదువుకోమని వదిలేశాను.
7. Observations on the current global affairs 8. నేను ఇంతకు ముందు రాసిన నవల continue చెయ్యడం
9. ఏదో కవిత్వం మళ్ళీ వ్రాద్దామని ప్రయత్నం -అప్పుడప్పుడు ఏదో ప్రయత్నిస్తున్నాను
10. Space
11. Premonition, ESP ,faith healing etc.,
Duping History అంత సులువైన పని ఇంకోటి లేదు. దీన్నిsubstantiate చెయ్యడానికి నాకు తెలిసిన ప్రపంచ చరిత్ర కి prologue లాగా నా జీవితం లో జరిగిన సంఘటనలు కొన్ని చెబుతాను. ఈ సంఘటనలతో నా memories of life లో కూడా కొన్ని pages నింపచ్చు.
నేను 7th std లో సుందరి టీచర్ tuition join అయ్యాను. Intermediate 1st year వరకు బాగానే జరిగింది. తరువాత ఆవిడ మిగతా students కి నాకు చూపించిన indifference తో frustrate అయ్యి tuition కి సరిగ్గా వెళ్ళడం మానేసి శివకుమార్ అని ఒక degree friend ని పట్టుకున్నాను, కలిసి చదువుకోడానికి. వాడు చదువు తక్కువ sex కబుర్లు ఎక్కువ మొదలెట్టాడు. అలాగ track నించి deviate అయ్యి ఆ disturbance లో ఎలాగో Intermediate అయ్యింది అనిపించాను. Engineering seat రాలేదు మొదటి సారి. మళ్ళీ అదో frustration. అప్పుడు నాకు నా VT College friend కిశోర్ మళ్ళీ కలిశాడు. అప్పుడు వాడు చూపించిన ప్రపంచం, philosophy నా చిరాకు నించి నన్ను దూరం చేశాయి. వాడి Hindi tuition friend రాంబాబు అప్పుడు నాకు పరిచయం అయ్యాడు. మేము ముగ్గురం బాగా thick friends అయిన తరువాత మా మధ్య నడిచే ప్రధానమైన topic love. కిశోరన్న style కానీ, వాడి attitude కానీ, అమ్మాయిలతో మాట్లాడటానికి బెరుకు లేకపోవడం కానీ, ఏదైనా కానీ వాడికి చాలా మంది girl friends ఉండేవారు. రాంబాబు కి అప్పటికి వాడిని reject చేసిన ఒక case తో బాధపడేవాడు. నేను నా frustration నించి బయటపడటానికి వీళ్ళిద్దరి fancy catch చెయ్యడానికి నేనూ capable అని prove చేసుకోవడానికి ఎలాగ అని మధనపడుతూ ఉండేవాడిని. అలాటి సందర్భంలో నేను ఒక మంచి కథ చెప్పాను. నాకు ఒక girlfriend ఉందని ఎన్నో సంఘటనలు జోడించి మంచి అద్భుతంగా చెప్పాను. వాళ్ళు నమ్మారో, నమ్మలేదో తెలియదు కానీ ఆ imaginary love affair మీద చాలా discussions నడిచాయి, చివరికి ఆ మోత భరించలేక నేను రాంబాబు దగ్గిర confess అయ్యేవరకు. నిజంగా నేను confess అవ్వకపోయినట్టయితే వాళ్ళు నిజంగానే నా జీవితంలో జరిగాయి అనుకునేవారు. అదే కథ పిట్టకథలుగా మారి అవసరం వచ్చినప్పుడు వందమంది నోట్లో వందరకాలుగా వినపడుతుంది. ఇంతకీ అది ఎంతవరకు నిజం అన్నది ఎవరికీ అఖ్ఖరలేదు. నలుగురు friends మధ్యన జరిగే history duping ఇంతలా ఉంటే media network లేని రోజుల్లో ఇంకెంత మార్చి రాయొచ్చు. History గెలిచినవాడు వ్రాసుకునే autobiography అన్నాడు ఒక జ్ఞ్యాని.
నిజమో , అబధ్ధమో మనకు తెలియదు కానీ history duping లో నాకు నచ్చిన stories రామాయణం, క్రీస్తు చరిత్ర. ఇవే కాకుండా నాకు తెలిసిన History next post లో .
సశేషం
Saturday, May 12, 2012
New poetry -15
मेरा दोस्त तिवारीजी facebook मे लिखी कविता
मोहब्बत अब मोहब्बत हो चली है,
तुझे कुछ भूलता सा जा रहा हूं
ये सन्नाटा है मेरे पांव की चाप
'फ़िराक़' कुछ अपनी आहट पा रहा हूं
तुझे कुछ भूलता सा जा रहा हूं
ये सन्नाटा है मेरे पांव की चाप
'फ़िराक़' कुछ अपनी आहट पा रहा हूं
मेरा जवाब facebook मे
आहट जब होगी दिल की
मोहब्बत जवान होती है
सच की गली से गुजरे जब जिंदगी
खाक की पहचान होती है
खुद की फितरत से गले मिलकर
खामोशी की अरमान होती है
Friday, February 17, 2012
ఆలోచనల స్రవంతి - 24
ఇన్నాళ్లూ ఒక positive note లో blogలో వ్రాసిన తరువాత ఒక negative thought బుర్ర తొలిచేసింది.
ఇది కూడా చెప్పేసి ఇంక వ్రాయడం మానేద్దామనిపించింది. అందుకే ఈ ప్రయత్నం.
rk గాడు ఏదో రకంగా వ్రాయరా అని అన్నాడు. కానీ???
చాలామంది మార్పు కోరుకుంటున్నారు. బాగుంది.
కానీ ఏమి మార్పు కావాలి? దేన్ని మార్చేయాలి?
కొంతమంది ప్రపంచాన్నిమార్చేయాలి అంటారు.
కొంతమంది corruption ని రూపు మాపేసి ప్రపంచాన్ని శాంతివంతం చేసేస్తామంటారు.
కొంతమంది governance మార్చమంటున్నారు.
కొంతమంది మనుషుల నైజాన్నిమార్చేద్దామంటారు. నాలాటివాడు చిన్నప్పటి నించి పిల్లలకి తర్ఫీదు ఇచ్చేద్దామని ఒక idea.
ఆహారపుటలవాట్లు మారిస్తే మంచిదని కొందరు, జీవన విధానాన్ని మారిస్తే మంచిదని కొందరు ఇలాగ ఎవడి definition వాడికి ఉంది.
మరి వీటిని మార్చడానికి ఎవడి style వాడికి ఉంది.
కొంతమంది literature వ్రాసేసి మార్చేద్దామని, నాకు చిన్నప్పుడు తెలిసిన శ్రీశ్రీ నించి latest గా చేతన్ భగత్ వరకు. నాలాటి వాడు blogs
వ్రాసేసి ప్రపంచం మారిపోతుందని ఒక వెర్రి expectation.
కొంతమంది ఉపన్యాసాలు ఇచ్చి మార్చేద్దామనుకుంటారు. మళ్ళీ ఇందులో personality development ఉపన్యాసాలు, ధార్మిక ఉపన్యాసాలు, రాజకీయ ఉపన్యాసాలు ఇలాటివి ఎన్నో.
కొంతమంది media ని వాడుకుని మర్చేద్దామని. Newspaper , TV , cinema ఇలాటివి పట్టుకుని.
సత్యాగ్రహాలు చేసి, ఆందోళనలు చేసి మార్చేద్దామని కొందరు.
కానీ ఎందుకు మార్పు వెంటనే రాదు.
అసలు మార్పు కావాలనుకుంటున్న వాళ్ళెవ్వరు???
నా observation ఏంటంటే ప్రతీ వాడికి కావాల్సినవి అవే. ఐశ్వర్యం,సుఖం. అవి దొరకని వాడు మార్పు కావాలనుకుంటారు. పైకి చెప్పడానికి, discussion చెయ్యడానికి intellectual platform లో మంచి emotional గా ఉండడానికి మార్పు ,అదీ, ఇదీ ok . మంచి conviction కూడా ఉంటుంది. నిజానికి వాడు ఆ crisis లోంచి బయటపడగానే చల్లారిపోతుంది. అంతకు మించి ఏమీ లేదు.
కొంత మంది ఐశ్వర్యం, సుఖం ఉండి కూడా, కొంత ప్రపంచం, మార్పు అని మాట్లాడుతూ ఉంటారు. అది వాడికి జీవితం bore కొట్టి కావాలనుకుంటున్నమార్పు. వాడు ఉన్న సుఖమైన సామ్రాజ్యం లోంచి కష్ట పడు బాబు అంటే?? అప్పుడు చూడాలి. ఇంకా నేను చెప్పిన gamut లో లేకుండా బాధ పడుతుంటే దాని అర్ధం - ఎవడి chemical concentration బట్టీ వాడు ఇబ్బంది పడుతూ ఉండడమే.
అందుకే ఆ కొంతమంది కలలు కనే utopia అయిపోయే లాగ మార్పు రాదు. utopia కలలు కనేవాడు కూడా comfort zone లోకి వెళ్ళగానే అన్నీ మర్చిపోతాడు. ఆ comfort zone కాపాడుకోడానికి నానా ఆలోచనలు చేసి ఏంటో కష్టపడుతున్నాననుకుంటాడు. మళ్ళీ కష్టం కలగగానే మార్పు అని గెంతడం.
కష్టపడే వాళ్ళు, అశాంతి తో ఉండే వాళ్ళ percentage ఎక్కువైతే కొంత అలజడి. ఏదో కొట్టుకు చచ్చి మళ్ళీ మామూలే. మనం చదివిన history, మనం చూస్తున్న current affairs ఇవీ దానికి ప్రత్యక్ష ఉదాహరణలు.
మరి ఇంత సొద చేస్తున్న నేను కూడా దీనికి exception కాదు.
ప్రపంచం మారుతూనే ఉంది, ప్రతీ discovery తో ప్రతీ invention తో - ప్రతీ కాలం లోను తెలివైన వాడు సుఖంగా బ్రతుకుతూనే ఉన్నాడు. వాడి సుఖాన్ని వేరే వాళ్ళతో పంచుకోడానికి వాడికి కష్టం. అది మనిషిలోని స్వార్ధం - అది వాడి నైజం. అది తప్పా అంటే ఏమో కానీ - అది అంతే.
ఏది ఎలా నడిస్తే అలా నడవనీ అని చెప్పడానికి ఇంత గొడవ ఎందుకు అంటే
అది నాలోని chemical problem.
ఇంక నేను వ్రాయకూడదు అని అనుకుంటున్నాను. ఈ resolution ఎంతకాలమో తెలియదు. మళ్ళీ మరీ బాగా నొప్పి పెడితే ఏదైనా బయటపడతానేమో. అంతవరకూ సెలవు.
ఇన్నాళ్ళూ నా ఆవేశాన్ని చదివి ఈ blog కి 10,000 hits ఇచ్చిన వాళ్ళందరికీ పేరు పేరునా కృతజ్ఞ్యతలు.
ముసాఫిర్ అఫ్ ఇండియా
కొంతమంది ఉపన్యాసాలు ఇచ్చి మార్చేద్దామనుకుంటారు. మళ్ళీ ఇందులో personality development ఉపన్యాసాలు, ధార్మిక ఉపన్యాసాలు, రాజకీయ ఉపన్యాసాలు ఇలాటివి ఎన్నో.
కొంతమంది media ని వాడుకుని మర్చేద్దామని. Newspaper , TV , cinema ఇలాటివి పట్టుకుని.
సత్యాగ్రహాలు చేసి, ఆందోళనలు చేసి మార్చేద్దామని కొందరు.
కానీ ఎందుకు మార్పు వెంటనే రాదు.
అసలు మార్పు కావాలనుకుంటున్న వాళ్ళెవ్వరు???
నా observation ఏంటంటే ప్రతీ వాడికి కావాల్సినవి అవే. ఐశ్వర్యం,సుఖం. అవి దొరకని వాడు మార్పు కావాలనుకుంటారు. పైకి చెప్పడానికి, discussion చెయ్యడానికి intellectual platform లో మంచి emotional గా ఉండడానికి మార్పు ,అదీ, ఇదీ ok . మంచి conviction కూడా ఉంటుంది. నిజానికి వాడు ఆ crisis లోంచి బయటపడగానే చల్లారిపోతుంది. అంతకు మించి ఏమీ లేదు.
కొంత మంది ఐశ్వర్యం, సుఖం ఉండి కూడా, కొంత ప్రపంచం, మార్పు అని మాట్లాడుతూ ఉంటారు. అది వాడికి జీవితం bore కొట్టి కావాలనుకుంటున్నమార్పు. వాడు ఉన్న సుఖమైన సామ్రాజ్యం లోంచి కష్ట పడు బాబు అంటే?? అప్పుడు చూడాలి. ఇంకా నేను చెప్పిన gamut లో లేకుండా బాధ పడుతుంటే దాని అర్ధం - ఎవడి chemical concentration బట్టీ వాడు ఇబ్బంది పడుతూ ఉండడమే.
అందుకే ఆ కొంతమంది కలలు కనే utopia అయిపోయే లాగ మార్పు రాదు. utopia కలలు కనేవాడు కూడా comfort zone లోకి వెళ్ళగానే అన్నీ మర్చిపోతాడు. ఆ comfort zone కాపాడుకోడానికి నానా ఆలోచనలు చేసి ఏంటో కష్టపడుతున్నాననుకుంటాడు. మళ్ళీ కష్టం కలగగానే మార్పు అని గెంతడం.
కష్టపడే వాళ్ళు, అశాంతి తో ఉండే వాళ్ళ percentage ఎక్కువైతే కొంత అలజడి. ఏదో కొట్టుకు చచ్చి మళ్ళీ మామూలే. మనం చదివిన history, మనం చూస్తున్న current affairs ఇవీ దానికి ప్రత్యక్ష ఉదాహరణలు.
మరి ఇంత సొద చేస్తున్న నేను కూడా దీనికి exception కాదు.
ప్రపంచం మారుతూనే ఉంది, ప్రతీ discovery తో ప్రతీ invention తో - ప్రతీ కాలం లోను తెలివైన వాడు సుఖంగా బ్రతుకుతూనే ఉన్నాడు. వాడి సుఖాన్ని వేరే వాళ్ళతో పంచుకోడానికి వాడికి కష్టం. అది మనిషిలోని స్వార్ధం - అది వాడి నైజం. అది తప్పా అంటే ఏమో కానీ - అది అంతే.
ఏది ఎలా నడిస్తే అలా నడవనీ అని చెప్పడానికి ఇంత గొడవ ఎందుకు అంటే
అది నాలోని chemical problem.
ఇంక నేను వ్రాయకూడదు అని అనుకుంటున్నాను. ఈ resolution ఎంతకాలమో తెలియదు. మళ్ళీ మరీ బాగా నొప్పి పెడితే ఏదైనా బయటపడతానేమో. అంతవరకూ సెలవు.
ఇన్నాళ్ళూ నా ఆవేశాన్ని చదివి ఈ blog కి 10,000 hits ఇచ్చిన వాళ్ళందరికీ పేరు పేరునా కృతజ్ఞ్యతలు.
ముసాఫిర్ అఫ్ ఇండియా
Wednesday, January 25, 2012
ఆలోచనల స్రవంతి -23
Purpose of life in materialistic plane
సంతోషంగా, సుఖంగా ఉండడమే purpose of life. అంతకు మించి వేరే ఏదీ definition లేదు. సుఖం, సంతోషం ఎలా వస్తాయి - నీ లోపల, బయట ఉండే nature తో నువ్వు సమత్వం పొందాలి. అప్పుడు అవి పొందగలవు.
నా reasoning ఏంటంటే కొంత ప్రకృతి పరంగా వచ్చే వారసత్వం, కొంత సమాజం - ఈ internal, external factors చేత influence అయ్యే మనిషి తన ప్రభావం చూపించే సమాజం - ఇదొక వలయం - ఈ వలయాలు మనిషిని నడిపిస్తూ ఉంటాయి.
మనిషికి ఏది సుఖం,సంతోషం అన్నది చూసే ముందు జీవితం గురించి కొంత అవగాహన కావాలి .
Spiritual గా ఎవరో ఇచ్చే definitions వదిలేస్తే జీవితం అంటే నువ్వు భౌతికంగా బ్రతికే కొన్నేళ్ళు. ఈ కొన్నేళ్లలో నువ్వు సుఖంగా ఉండాలంటే ముందు చెప్పినట్టు మూడు basics తీరాలి. అవి internal గా తీరుతూ ఉంటె నీ existence ఉన్నట్టే. ఆ తరువాత external ఉన్నది నీలాగే పదిమంది కలిసిన సమాజం. ఆ రకరకాల కలగాపులగపు సమాజంలో సమతుల్యత వచ్చి అందరూ సుఖంగా ఉండాలంటే కొంత governance అవసరం. ఈ governance ఎవడి చేతులో ఉంటె వాడు తన స్వార్ధానికి, సౌఖ్యానికి వాడుకుని అందరిని నలిపేస్తాడు. అందుకే బాగా ఆలోచించగలిగిన పెద్దలు వివేకానందుడు, బుద్ధుడు లాటి వాళ్ళు society సంతోషంగా ఉండడానికి individual reform మీద పడ్డారు.
"A generous heart, kind speech, and a life of service and compassion are the things which renew humanity." Buddha
ఇంక అసలు విషయం ఈ spiritual plane అనేది ఉందా. నాకు తెలిసి లేదు. అది ఒక భావన. ఆ భావన నీలో ఉన్న సమాజానికి హాని కలిగించే చెడుగుని ఆపుతుంది. అందుకే పెద్దలు ఆ భావనని చంప లేదు. భగవంతుడు ఉన్నాడనే అన్నారు. భయానికి, బాధకి శరణాగతి అన్నారు. విచ్చలవిడితనానికి, అహంకారానికి పగ్గాలు వెయ్యడానికి శిక్ష అన్నారు. society లోstability లేకపోతే మన civilized human race బతికేది jungle theory లోనే. అది రోజూ restless గా unstable గా indisciplined గా ఉండే జీవితాన్ని ఇస్తుంది. సౌఖ్యం ఉండదు. అందుకే morals , rules మానవ జాతిని ఒక రకంగా discipline లో పెడతాయి.
నిజంగా జీవితానికి అర్ధం లేదు. అది ఒక నిరంతర ప్రవాహం. Life is a continuous flow of energy till it dissipates. కానీ ఉన్నన్నాళ్ళు భౌతికమైన ఈ శరీరంలో ఉండే ఈ మెదడు చూపించే చమక్కులు అన్నీ చూడడమే. అంతే.
Sunday, January 8, 2012
ఆలోచనల స్రవంతి -22
నేను మంచి చెడు అని ఏదో వ్రాస్తే rk చెలరేగి రెండు ఠావుల essay వ్రాసి delete చేసేశాడు.అది ఏమైనా కాని వాడిని వాడి students రెండు అద్భుతమైన questions వేశారు.
1. అన్నీ ఇంతకూ ముందు వాళ్ళే కనిపెడితే మనకి ఇంకా చెయ్యడానికి ఏమీ లేదా -follow అవ్వడం తప్పించి ?
2 . అసలు అదేదో spiritual plane లో చెప్పారు కాని అసలు materialistic plane లో purpose of life అంటూ ఏమి ఉండదా?
1 . human తాలూకు basic structure మారనంత కాలం ఏమి మార్పులు ఉండవు. మనిషి కూడా మారుతున్న nature కి అనుగుణంగా మారినప్పుడు basic requirements మారుతాయి. కనిపెట్టడానికి ఏమీ లేవా అంటే కనిపెట్టడానికి బోలెడు ఉంది. కాని కనిపెట్టిన వాటి అవసరం ఎంత ఉంది అనేది చూడాలి. ఇంతకు ముందు అనుకున్నట్టు ప్రతి ప్రాణికి basic requirements ఆహార నిద్రా మైధునాలే. వాటిని దాటి ఇంకేదైనా అవసరం ఉందా అంటే పైన చెప్పినట్టు అది ఆనాటి కాలమాన పరిస్థితులకి, అభిరుచులకి, వేరే ఇతరత్రా అవసరాలకి పనికి వచ్చేవే కానీ basics కావు. నిప్పు కనిపెట్టక ముందు అన్నిరకాల పచ్చివి తిని human నిలబడ్డాడు. నిప్పు తరవాత వంట నేర్చుకున్నాడు. చలి కాచుకోవడం మొదలెట్టాడు ,steam engine కనిపెట్టాడు,ఇలాగే దాని applications ఎన్నో. మరి నిప్పు లేక ముందు కూడా ఉన్నాడంటే ఆ కాల మానానికి తగ్గటుగా అతని శరీరాకృతి, అన్ని అమరికలు ఉండేవి. మరి మనిషికి నిప్పు అవసరమా అంటే, అవసరమే. పక్వమైన ఆహారాన్ని శరీరానికి input ఇస్తే తినే పదార్ధంలో మలినాలు పోయి తేలికగా జీర్ణం చేసుకుందికి దోహదకారి అవుతుంది. రుచిగా ఉంటుంది. ఉడకపెట్టడం వల్ల కొన్ని పోషక విలువలు పోతాయి. అందుకే ఇప్పుడు latest nutritional values ఉన్నfood అంటే raw and cooked తాలూక combination. అలాగే శరీరానికి comfort నిప్పుని పద్ధతిలో వాడుకుంటే. దూర ప్రయాణంలో తొందరగా గమ్యం చేరొచ్చు engines సహాయంతో. మనిషికి కప్పుకోవడానికి బట్టలు అవసరమా అంటే, బట్టలు లేనప్పుడు చలి నించి కాపాడుకోవడానికి తగ్గట్టుగా చర్మాలు మందంగా ఎక్కువ రోమాలతో ఉండేవి. refinement వచ్చి బట్ట కట్టడం నేర్చిన తరువాత ఆకృతి మారింది. ఇలాగే ప్రతీ విషయంలోనూ చాల examples ఇవ్వొచ్చు. మారుతున్న ప్రకృతి, దానికి తగ్గట్టుగా మారే ప్రాణి. ఏదో బ్రతికేద్దాం అంటే గొడవలేదు కాని, కనిపెట్టిన వాటితో వచ్చే సుఖం తెలిసిన తరువాత ప్రతీ వాడికి ఆ additional facilities,comforts కావాలనే, అవసరమే. మారుతున్న జీవన విధానాలు, కనిపెడుతున్న కొత్త కొత్త వస్తువుల తాలూకు applications మనిషిని మరింత సుఖమయమైన జీవితానికి చేరేలా ప్రోద్బలం చేస్తాయి. అలాగే వాటితో పాటు వచ్చే కష్టాలు. ఇంతకు ముందు కనిపెట్టినవి మనిషి తాలూకు civilization cycle crest కి వెళ్లినప్పుడు వాడు compile చేసినవి. కొన్ని ఊహలు, కొంత logic, కొన్ని అనుభవాలు, కొన్ని ఆచరించి తెలుసుకున్న నిజాలు. ఆ civilizations అన్నీ మట్టి పాలై మళ్ళీ పునరుద్ధరణ తరువాత మొదలైన కొత్త civilization మనది.కనుక మనం ఇప్పుడు already prove అయిన నిజాలని follow అవ్వడమే కొత్త వాటి అవసరం పడేవరకు.
Purpose of life in the materialistic plane గురించి నాకు తెలిసింది next post లో.
Monday, January 2, 2012
ఆలోచనల స్రవంతి - 21
రాంబాబు కి చిరాకేసి విసుగొచ్చింది
అసలు ఏదీ వ్రాయకూడదు అనుకున్నాను. చెప్పడం, వినడం రెండిటి మీద bore కొట్టింది.
ఎవడికీ చెప్పడానికి ఏమీ లేదు. Eternal truths అందరికి ఒకటే. ఎవడికి అర్ధమైన ప్రపంచాన్ని వాడు చెబుతున్నాడు. ఎవడి అనుభవాన్ని వాడు చెబుతున్నాడు. ఎవడి ఆవేశాన్ని వాడు వ్యక్త పరుస్తున్నాడు. భౌతికమైన ప్రపంచంలో ఎవడికి వాడిదే నిజం. అంతకన్నా నిజం లేదు. ఎవడికి వాడికి - వాడికున్న శక్తిని బట్టి, తెలివిని బట్టి - మారుతున్న ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకి తగ్గట్టుగా మార్చుకుంటూ - ఇదింతే. ఇదే విషయాన్ని ఎన్నోసార్లు మాటలు మార్చి చెబుతూనే వచ్చాను. ఎందుకంటే నాకు అర్ధమైన ప్రపంచం అది కాబట్టి. అందుకే అసలు ఏదీ వ్రాయకూడదు అనుకున్నాను.
కానీ రాంబాబు గాడి నిరాశ నిండిన కవిత చూశాక నాకు ఎక్కడో ఏదో కెలికినట్టయింది. వాడు ఎన్నో సార్లు నన్ను emotional stress కి గురి చేశాడు. వాడితో నాకున్నది అదో love hate relationship . వాడిలో నాకు నచ్చినవాటి కంటే నచ్చనివే అన్నీను. కానీ ఎందుకో వాడి గురించి పట్టించుకోకూడదు అనుకున్నా, నేను react అవుతాను. వాడంటే అదో soft corner. క్రొత్త సంవత్సరం మొదలైంది. వీడు మొదలుపెట్టాడు. ఏదీ తెలియని వాడు కాదు. తెలిసినవాడే. ఎన్నో situations ని నా కంటే బాగా handle చెయ్యగలడు. మరెందుకో వాడికి విసుగు. వాడి frustration కి vent లేక ఈ సమస్యలేమో.
నా observation ఏంటంటే ప్రపంచమంతా ఒక రకమైన unrest లో ఉంది. Capitalists ,middle class intellectuals , proletariat , అందరూ ఒక రకమైన చిరాకులో బ్రతుకుతున్నారు. అందుకే రకరకాల ఈ agitations, repressions, peace talks. ఇది planetary constellations తాలూక affect లేదా over driven capitalism తాలూక affect ఏదైనా అవ్వొచ్చు. ఇది ఈ unrest ఎక్కడో ఒక చోట volcano లాగ బద్దలవుతుంది. మనం యుద్ధానికి యుద్ధానికి మధ్యనున్న సంధి కాలంలో చాలా శాంతిలో బ్రతుకుతున్నాం. ఇది ఎన్నాళ్ళో ఎవడికీ తెలియదు. కలియుగానికి అంతమైతే నాకు తెలిసి అప్పుడే లేదు.
ఇప్పుడున్న ప్రపంచంలో ఈ share markets పతనాలు, funds misappropriations చేసే నాయకులు , దేశాన్ని తాకట్టు పెట్టి, తార్చుకు తినే మహాత్ములు , వాళ్ళు vangaurdsలా తయారు చేసిన economy, ఇలాటి unrest లో ఉన్న economy తయారు చేసిన situations లో బ్రతుకుతున్నప్పుడు విసుగు తప్పదు. మరి ఇలాటి పనులు చేస్తున్న వాళ్లకి మంచి చెడు విచక్షణ అనవసరం. వారి స్వార్ధం, సుఖం, అహం చూసుకోవడం తోనే సరిపోతుంది. ఒక రకంగా చూస్తే అది సహజమనిపిస్తుంది. ఎందుకంటే మంచి చెప్పడం, వినడం బాగానే ఉంటుంది. ఆచరించడానికి ముడుకులు జారిపోతాయి. Society ని ఒక equilibriumలో ఉంచుతుంది. మంచి తాలూకు dish చప్పగా ఉంటుంది - రుచి పచి ఉండదు - కానీ ఆరోగ్యానికి మంచిది. చెడు చెయ్యడంలో ఒక kick ఉంటుంది. మంచి మసాలా దట్టించిన dish లాగ. నోటికి రుచి - ఆరోగ్యం నాశనం. చెడు ఎప్పడు shortcut solution లాగ కనపడుతుంది కాని అది ఒక long term లో ఒక epidemic లాగ మారిపోతుంది. ఎవడైనా general గా palatable గా లేని చప్పిడి కూడు కంటే ఆరోగ్యం నాశనం అయినా మసాలా నే opt చేస్తాడు. చెడు తాలూక fundamental ఇదే.
రాంబాబుకి చెప్పడం వరకు అయితే ok . కానీ ఈ universal principle ఒప్పుకుంటే ఎవడి శక్తిని బట్టి వాడు దోచుకొండిరా అన్నట్టుంటుంది. మరేమి చేద్దాం.
నాకు అనిపించిన ఒక positive solution . ఎప్పుడూ సొంత లాభం చూసుకోవడమే కాకుండా, ఎవడికున్న పరిధిలో వాడు సమాజానికి ఎంత మంచి చెయ్యగలిగితే అంత మంచిది. అప్పుడు ప్రతీ వాడికి పక్కవాడికి సేవ చెయ్యడమనే avocation ఉండి, సాయం పొందినవాడి తాలూకు పొగడ్తలో ఒక తృప్తి రావడం మొదలెడుతుంది. అదేదో చిరంజీవి గాడి సినిమా టాగోర్, స్టాలినో గుర్తులేదు అలాగన్నమాట. కొంత సమాజం కూడా బాగుపడుతుంది. అంతా materialistic గా పొతే personal గా లాభం ఉంటుంది కానీ unrest ని బాగా expedite చేసి civil wars కి మన వంతు సహకారం అందించినట్టుంటుంది.
ఇది ఎవడికి వాడే ఏది చెయ్యాలో తెల్చుకోవలిసిన క్షణం. ఇదీ నిజం.
Subscribe to:
Posts (Atom)